Business News: తుప్పు పట్టకుండా ఉక్కు.. రూ.1200 కోట్ల పెట్టుబడులు..!

Business News in Telugu: ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ రూ.1,200 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చింది. సికింద్రాబాద్‌లో MS లైఫ్ 600+ CRS (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 6, 2025, 06:35 PM IST
Business News: తుప్పు పట్టకుండా ఉక్కు.. రూ.1200 కోట్ల పెట్టుబడులు..!

Business News in Telugu: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.1200 కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. తద్వారా 5 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ లైఫ్ 2024లో 25 వేల ఇళ్ల నిర్మాణానికి ఉక్కును అందించగా... 2025-26 నాటికి రెట్టింపు సంఖ్యలో చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించింది. అధునాతన తుప్పు నిరోధకతను కలిగిన ఉక్కును అందిస్తోంది. ఇటీవల సికింద్రాబాద్‌లోని T19 టవర్స్‌లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో MS అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి MS లైఫ్ 600+ CRS (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది. రానున్న నాలుగేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ.1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అత్యాధునిక ఆర్ అండ్ డీ ద్వారా తాము ఎంఎస్ లైఫ్ 600+ CRS TMTని రూపొందించామని వెల్లడించారు. ధృడమైన ఉక్కుతో నిర్మాణాలను బలోపేతం చేస్తూ.. ప్రపంచ స్థాయి ఉక్కుతో గృహ కొనుగోలుదారులను శక్తివంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉత్పత్తిని పెంచడంతో పాటు, పవర్ ప్లాంట్, అదనపు ఉక్కు ఉత్పత్తులు, మెరుగైన కట్ & బెండ్ సేవలతో వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నామని అన్నారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి MS లైఫ్ 600+ CRS TMT రీబార్లు తెలంగాణలోని తూప్రాన్ మండలంలోని యూనిట్ 1, ఏపీలోని నాయుడుపేట యూనిట్2లో ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. 

అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి జీరో-కాలుష్య తయారీకి ఉక్కు పరిష్కారాలతో పరిశ్రమకు తమ కంపెనీ నాయకత్వం వహిస్తోందన్నారు. 2010లో FE 500 ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎస్ వారసత్వాన్ని పెంపొందించుకుందని... MS లైఫ్ 600+ CRS ఆవిష్కరణతో బలమైన, స్థితిస్థాపకతలో కొత్త ప్రమాణాలను నిర్దేశించే కంపెనీ ప్రయాణంలో మరో మైలురాయిని సూచిస్తుందని అన్నారు. 2024లో MS లైఫ్ 25,000 ఇళ్ల నిర్మాణానికి దోహదపడిందని.. 2025 నాటికి ఆ సంఖ్యను 50 వేల ఇళ్లకు పెంచాలనే ప్రణాలికతో పని చేస్తున్నామని వెల్లడించారు. తుప్పు నుంచి రక్షిస్తూ.. కాల పరీక్షను తట్టుకునే బలమైన భారత నిర్మాణానికి ఉక్కును అందించడమే తమ ఉద్దేశమన్నారు. 

Also Read: Kancha Gachibowli: హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్‌ సంచలన లేఖ

Also Read: Golden Cave: బంగారు నిధితో నిండిన గుహ.. ఆ ద్వారం తెరిస్తే ఇండియా ఫుల్‌ రిచ్ అవుతుంది..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News