)
Donald Trump: ఒరేయ్ జాత్యహంకారి ట్రంప్ నీ వల్ల ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తగుతుంది. నువ్ చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తావు. నీ బంధువులు, స్నేహితులు, భార్య ఎవరూ లేకుండానే కుక్కచావు చస్తావు. నా మాటకు తిరుగులేదు. ఈ మాటలు అన్నది తెలుగు రాష్ట్రాల్లో సుపరిచుతులైన జ్యోతిష్యుడు ములుగు సిద్ధాంతిగా పేరు సంపాదించిన ములుగు రామలింగేశ్వర వర ప్రసాద సిద్ధాంతి. ములుగు సిద్ధాంతి ప్రస్తుతం స్వర్గస్తులైనప్పటికీ ఆయన అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శాపం పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2016లో ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు భారతీయులను, ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న ఐటీ నిపుణులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ములుగు సిద్ధాంతి .. నీ వల్ల చాలామంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. నీ పాపానికి తగిన ఫలితం తప్పక వస్తుంది. నీ చివరి రోజుల్లో నీవు ఒంటరిగా, ఎవ్వరూ పక్కన లేకుండా, కుక్క చావు చస్తావు అంటూ ట్రంప్ను శపించారు.
ఆ సమయంలో ఈ వీడియో పెద్దగా వైరల్ అవ్వకపోయినా.. ప్రస్తుతం తిరిగి సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్ అవుతోంది. కారణం ఏంటంటే.. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అని చెప్పాలి. ముఖ్యంగా H-1B వీసాలపై కొత్త నిబంధనలు భారతీయ ఐటీ ఉద్యోగులను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటివరకు సాధారణంగా దరఖాస్తు చేసుకునే వీసాలకు, ఇప్పుడు కనీసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిందే అని ఆయన ఆర్డర్ సంతకం చేశారు. ఇది అనేకమంది భారతీయ నిపుణులకు అమెరికాలో కెరీర్ కలలపై నీళ్లు జల్లు చేసింది.
నిజానికి 2016 ఎన్నికల్లో అమెరికాలో స్థిరపడిన భారతీయులు ట్రంప్కు గణనీయంగా మద్దతు ఇచ్చారు. ఆయన భారతదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తారని, ఉగ్రవాదాన్ని అరికడతారని, చైనాకు చెక్ పెడతారని పెద్ద ఎత్తున విశ్వసించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా భిన్నంగా మారింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ వైపు ట్రంప్ మొగ్గుచూపడం, భారతీయ వస్తువులపై టారిఫ్లు విధించడం వంటి చర్యలు భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. అంతేకాకుండా అమెరికాలో ఉన్న డెమోక్రాటిక్ నేత కమలా హారీస్కి భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో ట్రంప్కు భారతీయుల మద్దతు ఎక్కువగా లభించింది. కానీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు అమెరికాలోని భారతీయులు ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక ములుగు సిద్ధాంతి శాపం గురించి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఆయన స్వర్గస్తులైనప్పటికీ.. ఆయన మాటలు ట్రంప్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో స్పష్టంగా వినిపిస్తున్నాయనే అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులకు కలిగిన నష్టాలను గుర్తు చేస్తూ, ములుగు సిద్ధాంతి పెట్టిన శాపం తప్పకుండా ఫలమిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.