)
Monetary Policy Committee: దీపావళికి ముందే దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక శుభవార్త వచ్చింది. సెప్టెంబర్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) గణనీయంగా తగ్గి 1.54శాతానికి చేరింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, వంటనూనెలు, నెయ్యి, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గడంతో ఈ ఉపశమనం వచ్చింది. టోకు ధరల సూచిక (WPI) కూడా 0.13శాతం తగ్గి, మార్కెట్లో స్థిరత్వం నెలకొంది. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్లో ప్రజలకు రెండు ప్రధాన బహుమతులు ఇవ్వబోతోందని ఎస్బిఐ (SBI) తాజా రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. వాటిలో మొదటిది.. వడ్డీ రేట్లలో తగ్గింపు, రెండవది.. ఉపశమన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.
డిసెంబర్ 3 నుండి 5 వరకు జరగబోయే ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశంలో, RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. దీంతో ప్రస్తుత 5.5శాతం రేటు 5.25శాతానికి పడిపోతుంది. ఈ మార్పు జరిగితే, బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలను అందించగలవు. ఫలితంగా, హౌసింగ్ లోన్, కారు లోన్, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలపై EMI భారం తగ్గి, సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది.
SBI నివేదిక ప్రకారం, RBI ఈ నిర్ణయం తీసుకోకపోతే టైప్-2 తప్పిదం అవుతుందని పేర్కొంది. అంటే సరైన సమయంలో సరైన చర్య తీసుకోకపోవడం. గతంలో కూడా, GST రేట్ల తగ్గింపుతో ద్రవ్యోల్బణం 35 బేసిస్ పాయింట్లు తగ్గిందని నివేదిక గుర్తు చేసింది. కాబట్టి, ఇదే సరైన సమయం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు. అందులో ముగ్గురు RBI ప్రతినిధులు గవర్నర్ సంజయ్ మల్హోత్రా, డిప్యూటీ గవర్నర్ ఎం. రాజేశ్వర్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ రంజన్ ఉన్నారు. మిగతా ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆర్థిక నిపుణులు డాక్టర్ నాగేష్ కుమార్, సౌగతా భట్టాచార్య, ప్రొఫెసర్ రామ్ సింగ్ ఉన్నారు.
అమెరికా విధించిన కొత్త సుంకాల భారం కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, RBI ఒక ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ప్రకటించే అవకాశముంది. ఇది వ్యాపార రంగానికి ద్రవ్యత అందించడమే కాకుండా, మార్కెట్కు సానుకూల శక్తినిస్తుంది. ఈ ప్యాకేజీ వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు ఊతమివ్వగలదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గడం, ధరల స్థిరత్వం రావడం, GST ప్రభావం కొనసాగడం ఇలా అన్ని కలిపి డిసెంబర్లో RBI రెండు సానుకూల నిర్ణయాలు తీసుకునే దిశగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకటి వడ్డీ రేటు తగ్గింపు, రెండోది ఆర్థిక ఉపశమన ప్యాకేజీ. ఈ రెండూ జరిగితే, 2025 సంవత్సరం చివరలో ఆర్థిక రంగానికి బలమైన పాజిటివ్ మలుపు తిప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook