)
Real Estate Boom: హైదరాబాద్ అభివృద్ధి పరిధి మరింత విస్తరించబోతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చుట్టూ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల జోరు ఊపందుకుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలతో రాబోయే రోజుల్లో మరో భారీ గ్రోత్ కారిడార్ ఏర్పడనుంది. రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్ట్ వెంబడి రీజనల్ రింగ్ రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు మౌలిక వసతులు ఒకేసారి వస్తే, హైదరాబాద్ చుట్టుపక్కల 11 జిల్లాలు అభివృద్ధి పరంగా కొత్త దిశలో పయనిస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ కోసం 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపడుతోంది ప్రభుత్వం. అదనంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ కోసం మరో 50 మీటర్ల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఉత్తర, దక్షిణ భాగాలను కలిపితే మొత్తం రైల్వే లైన్ దాదాపు 400 కిలోమీటర్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లైన్ ఏర్పాటు వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలు నగరాలతో సులభంగా కలుస్తాయి.
హెచ్ఎండీఏ ఇప్పటికే 364 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ రోడ్డుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది రంగా రెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తరించనుంది. దక్షిణ భాగంలో 201 కిలోమీటర్లు, ఉత్తర భాగంలో 163 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనుంది. ఈ రోడ్డు పక్కనే రీజనల్ రైల్వే లైన్ ఉండటం వలన రవాణా సౌకర్యాలు మరింత బలపడతాయి.
ముఖ్యంగా రవాణా మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊపునిస్తుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పెరిగాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్–రింగ్ రైలుతో మరో కొత్త గ్రోత్ కారిడార్ ఏర్పడుతుంది. ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ ప్రాజెక్ట్పై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. రీజనల్ రింగ్ రైలు ఏర్పాటుకు కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై వేగంగా ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తృతమవుతాయి.
అంతిమంగా చెప్పాలంటే, రీజనల్ రింగ్ రోడ్తో పాటు రైల్వే లైన్ వస్తే, హైదరాబాద్ చుట్టూ మరో భారీ అభివృద్ధి వలయం ఏర్పడనుంది. ఇది కేవలం రవాణా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఉపాధి రంగాల వృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ 11 జిల్లాల్లో ఇప్పుడు భూములు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఈ జిల్లాలపై పడింది. ఆ జిల్లాల్లో భూములను కొనుగోలు చేసేందుకు భారీగా క్యూ కడుతుున్నారు. దీంతో అక్కడి భూములకు రెక్కలు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.