
Reliance stock: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా పాజిటివ్ అవుట్లుక్ను ప్రకటించింది. చైనా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు రిలయన్స్ భవిష్యత్ వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తాయని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్ టార్గెట్ ప్రైస్ను రూ.1,602 నుండి రూ.1,701కి పెంచింది. దీంతో ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి పెరుగుతోంది.
చైనా ప్రభుత్వం పరిశ్రమలలో అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు యాంటీ ఇన్వొల్యూషన్ విధానాలను అమలు చేస్తోంది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే మార్కెట్లో అనవసర పోటీని తగ్గించడం, సరఫరా-డిమాండ్ మధ్య సమతౌల్యం సాధించడమని అర్థం. ముఖ్యంగా సోలార్ రంగంలో చైనా ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పడిపోతున్నాయి. ఈ పరిస్థితిని సవరించేందుకు తీసుకుంటున్న చర్యలు భారతీయ కంపెనీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుకూలంగా మారనున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలయన్స్ ఇప్పటికే గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, భారత్లో సమగ్ర సోలార్ సప్లై చైన్ నిర్మాణంలో ముందడుగు వేసింది.
మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం చూసినట్లయితే.. చైనా ఉత్పత్తిని తగ్గించడం వల్ల రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ధరలు కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. 2030 నాటికి రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగంలో ఖర్చులు 40 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. 2027 నాటికి కంపెనీ ఆదాయంలో 13 శాతం వరకు న్యూ ఎనర్జీ నుంచి వచ్చే అవకాశముందని చెప్పుకోవచ్చు. అలాగే చైనా చర్యలు, రిలయన్స్ పునర్వ్యవస్థీకరణ కలిసి దాదాపు 20 బిలియన్ డాలర్ల నికర ఆస్తి విలువను జోడించవచ్చని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. 2028 నాటికి కంపెనీ రెవెన్యూ 17 శాతం పెరుగుతుందని కూడా తెలిపింది.
కాగా ఇటీవల జరిగిన ఏజీఎంలో ముకేశ్ అంబానీ భవిష్యత్ వ్యూహాలను స్పష్టంగా వివరించారు. సంప్రదాయ శక్తి రంగంలో కొనసాగుతూనే, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, సోలార్, బ్యాటరీ నిల్వల వంటి రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అదనంగా జియో ఐపీఓను 2026లో తీసుకురానున్నట్లు కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ముఖేశ్ అంబానీ వివరించారు.
ఈ పరిణామాలన్నీ కలిపి రిలయన్స్ షేర్లకు అనుకూలంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. మోర్గాన్ స్టాన్లీ అంచనాలు కూడా అదే దిశగా ఉన్నాయి. అయితే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న అనిశ్చితులు ఎప్పుడూ ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.