ATM Transaction: ATM ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోత మోగించబోతుంది. ఒక రకంగా వినియోగదారుల పాలిట ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అలా ATM ద్వారా క్యాష్ విత్ డ్రా చేస్తే వారి అకౌంట్లో డబ్బులు తగ్గిపోనున్నాయి.
ఎందుకంటే ATM ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తే పడే ఛార్జీలను బ్యాంకులు పెంచనున్నాయి. ఈ పెంపు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త ఛార్జీలు క్యాష్ విత్ డ్రాకే కాకుండా , అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కూడా అమలుకానున్నాయి. దీనిపై వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఇలా బ్యాంకులు ఛార్జీల మోతను నొప్పి తెలియకుండా చేస్తోంది. దీనిపై వినియోగదారులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఏదో తెలియకుండా.. ఈఎంఐలు సరైన సమయంలో కట్టకపోతే కూడా వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. మొత్తంగా బ్యాంకులు కొంత మంది పెద్దల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటిని NPA నాన్ పర్పామెన్స్ అస్సెట్స్ పేరిట క్లోజ్ చేస్తున్నాయి. అలా అని లాగ్ బుక్ లో చూపిస్తున్నారు కానీ.. అలా వసూళు కానీ మొండి బాకీలు చేసిన వ్యక్తులు వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయమై కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చింది. అలా నీరవ్ మోడీ, విజయ్ మాల్యాకు సంబంధించి భారత్ లో ఉన్న ఆస్తులను మన బ్యాంకులు ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. దీంతో మొండి బాకీలు పెట్టే పెద్దలకు చెమటలు పడుతున్నాయి. కానీ ఇలా చిన్న చిన్న మొత్తాలను జమ చేసుకునే వారిపై బ్యాంకులు ట్రాన్సాక్షన్ పేరిట ఛార్జీల మోత మోగించే విషయంలో కాస్త ఆలోచిస్తే మంచిదంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









