)
Salt-powered scooters: మనం ఇప్పటి వరకు డీజీల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ తో నడిచే స్కూటర్లను చూశాము. కానీ ఉప్పుతో నడిచే స్కూటర్ల గురించి ఎప్పుడైనా విన్నారా. అవును.. కొన్ని సంవత్సరాలలో మీరు రోడ్లపై ఉప్పుతో నడిచే స్కూటర్లను కూడా చూడవచ్చు. వాస్తవానికి ఇవి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లే కానీ వాటిలో ఉపయోగించే బ్యాటరీ సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీ కాదు.. కానీ ఇది సముద్రపు ఉప్పు నుండి తయారు చేసిన ఉప్పు-అయాన్ బ్యాటరీ అవుతుంది.
సముద్రపు ఉప్పుతో తయారు చేసిన సోడియం అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు చైనా వీధుల్లో రయ్ రయ్ అంటూ పరుగెడుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా $400, $660 (రూ. 35,000 నుండి రూ. 51,000) మధ్య అమ్ముడవుతున్నాయి.ఈ స్కూటర్లు సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఉపయోగించే లెడ్-యాసిడ్ లేదా లిథియం-అయాన్ కణాల ద్వారా శక్తిని పొందవు. కానీ వాటి బ్యాటరీలు సముద్రపు ఉప్పు నుండి సేకరించగల సమృద్ధిగా ఉండే మూలకం సోడియంతో తయారు చేశారు.
ఈ కొత్త స్కూటర్లను హాంగ్జౌలోని ఒక షాపింగ్ మాల్ ముందు టెస్ట్ డ్రైవ్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేశారు. వాటి సమీపంలో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తద్వారా వాటి బ్యాటరీని 15 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. సాంప్రదాయ లిథియం-అయాన్ లేదా లెడ్-యాసిడ్ బ్యాటరీలకు బదులుగా, కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్లు సముద్రపు ఉప్పు నుండి సేకరించిన సోడియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి.
ఇది చౌకైన పరిష్కారం మాత్రమే కాదు, సహజ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఒక ముఖ్యమైన అడుగు కూడా. యాడియా ఈ సాంకేతికత ఆధారంగా 3 విభిన్న మోడళ్లను ప్రవేశపెట్టింది.దీని ధర $400, $660 మధ్య ఉంటుంది. మొత్తానికి కొన్ని రోజుల్లో ఉప్పుతో నడిచే స్కూటర్లో భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టనున్నాయి. ఇక పెట్రోల్ టెన్షన్ లేనట్లే అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook