)
Top 5 schemes For women: భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం మహిళలు ఎల్లప్పుడూ ముందుచూపుతో వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చుల నుంచి చిన్న మొత్తాన్ని కూడా జాగ్రత్తగా పొదుపు చేయడం వారి అలవాటే. కానీ కొన్ని సందర్భాల్లో చేతిలో ఉన్న ఈ పొదుపులు సరిపోని పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందిస్తున్న భద్రమైన పొదుపు పథకాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఐదు ముఖ్యమైన పథకాలు భవిష్యత్తులో ఒక మద్దతుగా నిలుస్తాయి.
భారతీయ సంస్కృతిలో మహిళలు సంపద, శుభసూచకాల ప్రతీకగా భావిస్తారు. వారు చేసే పొదుపులు, పెట్టుబడులు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి బలంగా ఉంటాయి. క్రమంగా చేసే చిన్నపాటి పొదుపులు కూడా సురక్షిత పథకాలలో పెట్టుబడి పెడితే గణనీయమైన నిధిగా మారతాయి. ఇప్పుడు మహిళలకు అత్యంత అనుకూలమైన, రిస్క్ లేకుండా హామీ రాబడులు ఇచ్చే ముఖ్యమైన పథకాలను చూద్దాం.
1. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)
మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకం పూర్తిగా భద్రతతో కూడినదే. పోస్టాఫీసులో ప్రారంభించగలిగే ఈ డిపాజిట్పై ప్రభుత్వం 7.5శాతం వడ్డీ అందిస్తోంది. కనీస పెట్టుబడి రూ. 1,000 కాగా, గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు. ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత, జమ చేసిన మొత్తంలో 40శాతం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించి మంచి రాబడులు పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
2. సుభద్ర పథకం:
ఒడిశాలోని మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు బలమైన మద్దతుగా నిలుస్తోంది. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఐదు సంవత్సరాల్లో రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కుటుంబ అవసరాలకు బలమైన ఆదరణ కల్పించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
3. NCIGSE (బాలికల కోసం ఆర్థిక సహాయ పథకం)
పాఠశాల చదువుతున్న బాలికల కోసం రూపొందించిన ఈ పథకం ప్రత్యేకంగా అనుసూచిత కులాలు, తెగలకు చెందిన బాలికలకు ఉపయోగపడుతుంది. విద్య కొనసాగించేందుకు ప్రభుత్వం రూ. 3,000 ఒకసారి ఆర్థిక సహాయంగా అందిస్తుంది. కుటుంబానికి అదనపు భారంగా మారకుండా అమ్మాయిల చదువుకు తోడ్పడటమే ఈ స్కీమ్ లక్ష్యం.
4. సుకన్య సమృద్ధి యోజన (SSY)
బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకం బాలికల భవిష్యత్తు కోసం అత్యంత ప్రజాదరణ పొందింది. 8.2శాతం వంటి అధిక వడ్డీ రేటు అందించే ఈ స్కీమ్ సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది. కనీసం ₹250తో ప్రారంభించవచ్చు. బాలికల విద్య, వివాహ వంటి భవిష్యత్ ఖర్చులకు ఇది ఉత్తమమైన పెట్టుబడి మార్గం.
5. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్
ఈ స్కీమ్ మహిళలతోపాటు ఇతరులకు కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే.. ప్రతినెలా వడ్డీ తీసుకోవచ్చు. స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. వడ్డీ రేటు ప్రస్తుతం 7.40శాతం ఉంది. దీనిలో సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9లక్సలు, జాయింట్ అకౌంట్ కింద రూ. 15లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం వెయ్యి రూపాయలతో పెట్టవచ్చు. టెన్యూర్ కింద ఐదేళ్లు ఉంటుంది. వడ్డీ ప్రకారం మీ ఇన్వెస్ట్ మెంట్ పై నెలనెలా వడ్డీ మీకు అందుతుంది.
మొత్తం మీద, మహిళలు పొదుపులను తెలివిగా పెట్టుబడి పెడితే, కుటుంబ ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. పై పథకాలలో ఏదైనా లేదా ఒకటి కంటే ఎక్కువను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తుకై మంచి ఆర్థిక ఆధారాన్ని నిర్మించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.