
JP Morgan Advice: సోమవారం ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తన వాటాదారులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కంపెనీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం గేమ్ చేంజర్ అవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో బాగంగా కంపెనీ ప్రమోటర్లు స్వయంగా కంపెనీలో రూ. 2,237 కోట్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టబోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పెట్టుబడిని ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూపంలో పెట్టుబడి పెట్టనున్నారు.
సరళంగా చెప్పాలంటే, ప్రమోటర్లు కంపెనీలో తమ వాటాను పెంచుకోవడానికి తమ సొంత డబ్బును పెట్టుబడి పెడుతున్నారు. జెపి మోర్గాన్ సలహా మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ తెలుస్తోంది. ఇది కంపెనీ చరిత్రలో ఒక భారీ పరిణామంగా భావిస్తున్నారు. ఈ పెట్టుబడి ప్రిఫరెన్షియల్ బేసిస్ (Preferential Basis) పై కన్వర్టిబుల్ వారంట్ల (Convertible Warrants) రూపంలో కంపెనీలోకి పెట్టుబడి వస్తుంది. మరో విశేషం ఏమిటంటే..ఈ షేర్లను కంపెనీ మార్కెట్ ధర రూ. 128.58 ఉన్నప్పటికీ, ప్రమోటర్లు ఒక్కో వారంట్ను రూ. 132 ధరకు కొనుగోలు చేసేందుకు అంగీకరించారు.
ఇది కంపెనీపై వారి నమ్మకాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పెట్టుబడి అనంతరం ప్రమోటర్ వాటా గ్రూప్ లో 18.39శాతం వరకు పెరుగుతుంది. అంటే కంపెనీపై మరింత నియంత్రణ పొందే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ J.P. మోర్గాన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. జెపి మోర్గాన్ సలహా పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ప్రమోటర్ గ్రూపుకు 16,95,03,400 కన్వర్టిబుల్ వారెంట్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ డబ్బుతో కంపెనీ ఏమి చేస్తుంది?
కంపెనీ ఈ రూ. 2237 కోట్ల ఫండ్ ద్వారా కంపెనీ కంటెంట్, టెక్నాలజీ, వ్యూహాత్మక వృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది.అలాగే భవిష్యత్తులో ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా అవకాశానికి సిద్ధంగా ఉండేలా కంపెనీ ఆర్థిక పునాది బలంగా ఉండేలా కంపెనీ బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేయనుంది.
ZEE చైర్మన్ ఆర్. గోపాలన్ మాట్లాడుతూ, "ప్రమోటర్ల వాటాను పెంచడం వల్ల కంపెనీ వృద్ధి ప్రణాళిక కోసం మరింతగా పనిచేయడానికి బూస్ట్ పొందుతారని బోర్డు విశ్వసిస్తోంది. ఈ పెట్టుబడి ZEEని భవిష్యత్తులో మంచి స్థితిలో ఉంచుతుంది" అని ఆయన అన్నారు. ప్రమోటర్ గ్రూప్ ప్రతినిధి శుభం శ్రీ మరో ముఖ్యమైన మాట్లాడుతూ మే 1, 2025 నాడు ప్రమోటర్లు తమ వాటాను పెంచుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని, అప్పుడు షేరు ధర రూ. 106.35 అని ఆయన అన్నారు. కానీ నేటికీ ఈ అధిక ధర వద్ద షేర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి కంపెనీకి, దాని వ్యాపారానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook