Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్ ను వీడిన 786 మంది పాక్ జాతీయులు..

Pahalgam Terror Attack: ఈ నెల 22న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులు దేశం విడిచివెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ లో ఉంటున్న పలువురు పాక్ జాతీయలు దేశం విడిచివెళ్లారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2025, 11:00 AM IST
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి తర్వాత భారత్ ను వీడిన 786 మంది పాక్ జాతీయులు..

Pahalgam Terror Attack: భారత్ పాకిస్థాన్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో వివిధ పనులపై వచ్చిన పాకిస్థాన్ వాసులు రెండు రోజుల్లో  దేశం విడిచివెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24న కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అందులో ఏప్రిల్ 27న అందరు దేశం విడిచివెళ్లాని చెప్పింది. ఇక  మెడికల్ వీసాలపై వచ్చిన  పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 29 నాటికి భారతదేశాన్ని విడిచిపెట్టాలని అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.  దౌత్య, అధికారిక , దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని 'లీవ్ ఇండియా' నోటీసు నుండి మినహాయించారు. పాకిస్తానీయులకు 12 వర్గాలలో దేనినైనా స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్న గడువు ఆదివారం ముగిసింది.

పహల్గామ్ లో ఉగ్రవాదులు.. ముందుగా హిందువులను, ముస్లిమ్స్ ను వేరు చేసి అందులో 26 పురుషులను చంపింది. అందులో 24 మంది హిందువులు.. ఒకరు క్రిష్టియన్ కాగా.. మరొకరు ముస్లిమ్. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ తో ఉన్న అన్ని దౌత్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాటు పాక్ దేశంతో ఉన్న అన్ని ట్రేడ్ అగ్రిమెంట్ లను రద్దు చేసింది. అంతేకాదు భారత్ గగన తలం నుంచి పాకిస్థాన్ విమానాల రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మన దేశ సముద్రతీరంలో పాకిస్థాన్ నౌకలకు షెల్టర్ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వీసాపై వెళ్లిన భారతీయులు వెంటనే మన దేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. మరోవైపు మన దేశంలో ఉంటున్న పాక్ జాతీయులు రెండు మూడు రోజుల వ్యవధిలో వెళ్లిపోవాలన్నారు. లేకపోతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్ాన్ నేషనల్స్ పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్ 29 తర్వాత భారతదేశంలోనివాసం ఉంటే వారిని ఇల్లీగల్ గా పరిగణించి వారినీ తరలిస్తామన్నారు. ఇప్పటికే మన దేశం నుంచి అట్టారీ .. పాక్ వాఘా సరిహద్దు వద్ద 786 మంది పాక్ జాతీయులు వారి దేశంలో విడిచిపెట్టారు.  త్వరలో మిగతా వారిని ఏరివేసే పనిలో ప్రభుత్వం పడింది.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News