)
Actor darshan asks judges for poison in Renuka swamy murder case: కర్ణాటకలోని పరప్పన అగ్రహరం జైల్లో నటుడు దర్శన్ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తనకు జైలులో కనీసం వెలుతురు రావడంలేదని,ఫంగస్ వాసన వస్తుందని న్యాయమూర్తి ఎదుట వాపోయాడు. అంతేకాకుండా.. తనకు విషం ఇచ్చేలా ఆదేశించాలని కూడా సెషన్సు కోర్టు జడ్జీ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పటికే రేణుక స్వామి మర్డర్ కేసులో కర్ణాటక ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. దీంతో పోలీసులు మరల నటుడు దర్శన్ ను, పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. రేణుకస్వామి హత్య కేసు నెలవారీ విచారణ సందర్భంగా , నటుడు దర్శన్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు, హాల్ (CCH) ముందు హాజరై తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఫిర్యాదు చేశాడు.
దర్శన్ న్యాయమూర్తితో మాట్లాడుతూ, చాలా రోజులుగా సూర్యరశ్మిని చూడలేదని, ఎక్కడ ముట్టుకున్న చేతులకు ఫంగస్ అంటుకుంటుందని, బట్టలు దుర్వాసన వస్తున్నాయని చెప్పాడు. అంతే కాకుండా.. దయచేసి నాకు విషం ఇప్పించడని, ఇక్కడ జీవితం భరించలేనిదిగా మారిందని వాపోయాడు. ఈ క్రమంలో దర్శన్ చేసిన వ్యాఖ్యల పట్ల న్యాయమూర్తి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చిత్ర దుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకస్వామి అనే అభిమానిని హత్య కేసులో దర్శన్ను జూన్ 2024 లో అరెస్టు చేశారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు రేణుకస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపడంపై పెద్ద రచ్చ ఏర్పడింది. అది కాస్త రేణుకస్వామిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి, హత్య వరకు వెళ్లింది. ఈ ఘటన దేశంలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook