India govt ban on Pakistan actor fawad movie abir gulal: అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిని యావత్ భారతవనీ తీవ్రంగా తీసుకుంది. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టులను వాళ్ల వెనుక పాక్ ను వదలేది లేదని కేంద్రాన్ని కోరుతున్నారు. మరోవైపు మోదీ సర్కారు ఇప్పటికే పాక్ ను అష్టదిగ్బందనం చేసింది. మేజర్ గా తీసుకున్న ఐదు నిర్ణయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలో సింధూజలాల ఒప్పందం రద్దుచేసింది.
భారత్ లో పాక్ వాళ్లు 48 గంటల్లో తిరిగి పాక్ కు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.. అటారీ బార్డర్ ను క్లోజ్ చేసి, వీసాలు రద్దు చేసింది. రాయబార కార్యలయ సిబ్బందిని.. 50 నుంచి 30 కి తగ్గించారు. పాక్ లోఉన్న భారత్ దౌత్యాధికారుల్ని వెనక్కు రప్పించుకుంది. ఈ క్రమంలో మోదీ హైపవర్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలలో సింధుజలాల ఒప్పందను భారత్ క్యాన్షిల్ చేసుకొవడం పాక్ కు చావుదెబ్బగా చెప్పవచ్చు.
ఎందుకంటే.. పాక్ లో పంటలు పండటానికి ఎక్కువగా ఈ సింధు జలాలు ఉపయోగించుకుంటుంది. దీంతో ఈ నీళ్లు ఆగిపొవడంతో పాక్ కు మాత్రం పెద్ద కోలుకోలేని దెబ్బగా చేప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పాక్ ను మరింత ఇరకాటంలో పెట్టింది. పాక్ కు చెందిన నటుడు హీరోగా తీసిన అబీర్ గులాల్ ను భారత్ లోబ్యాన్ చేసింది. ఈ మూవీలో నటుడు ఫావాద్ ఖాన్ హీరోగా.. వాణికపూర్ హీరోయిగా చేశారు.
ఈ సినిమాను భారత్ బ్యాన్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీ భారత్ లో విడుదలయ్యేది లేదని అధికారులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కాకుండా.. ఇప్పుడు పాక్ సినిమా ఇండస్ట్రీకి సైతం మోదీ బిగ్ షాక్ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.
మొత్తంగా పహల్గం ఘటనను మాత్రం భారత్ తో పాటు, యావత్ ప్రపంచ దేశాలు ఈ ముష్కర దాడిని ఖండిస్తున్నాయి. పహల్గంలో ఆర్మీదుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









