Ponniyin Selvan: దీర్ఘకాలం విరామం తరువాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చోళుల స్వర్ణయుగం గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడీ చరిత్ర కళ్లముందు కన్పించనుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవిలు కీలక పాత్రల్లో కన్పించనున్నారు. సెప్టెంబర్ 30న విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఓటీటీ హక్కులు అప్పుడే అమ్ముడైపోయాయి.


ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించారు. సినిమా విడుదలకు ముందే సినిమా ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 2 రెండింటినీ కలిపి 125 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకుంది. ఇక డిజిటల్ హక్కుల్ని సన్ టీవీ దక్కించుకుంది.


ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితలు ఇతర ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచింది. ఓటీటీ హక్కుల్ని ఇంత భారీ స్థాయిలో చేజిక్కించుకోవడం గమనార్హం.


Also read: IBomma Restarted: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఐబొమ్మ మళ్లీ మొదలయింది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook