Avatar Re Release: జేమ్స్ కామెరూన్ యొక్క అవతార్: ది వే ఆఫ్ వాటర్ భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో అక్టోబర్ 2, 2025 నుండి ఒక వారం పాటు ఈ చిత్రం 3Dలో థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరోవైపు 2025 డిసెంబర్ 19న అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూడో చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదలకు ముందుగా ప్రేక్షకులు స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పండోరా యొక్క అద్భుతమైన నీటి అడుగుని ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు అందించబోతుంది.
2022లో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ నటించిన సులీ కుటుంబం యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి ఆస్వాదించమని చెబుతున్నారు.
20th సెంచరీ స్టూడియోస్ ఇండియా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2025 నుండి భారతదేశంలోని అన్ని థియేటర్లలో 3Dలో ఒక వారం పాటు ప్రదర్శించనున్నారు. ఇది అమెరికా రీ-రిలీజ్ కంటే ఒక రోజు ముందు మన దేశంలో మళ్లీ రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.