Emraan hashmi Reacts on pahalgam terror Attack: జమ్ముకశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదులు ఆర్మీదుస్తులో వచ్చి 26 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. ఈ ఘటనపై యావత్ భారతావణి కూడా చాలా సీరియస్ గా ఉంది. దీనిపై కేంద్రం కూడా పాక్ కు గట్టిగానే బుద్ది చెప్పే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే భారత్ పాక్ ను అష్టదిగ్బంధనం చేసింది. అదే విధంగా పాక్ తో చేసుకున్న సింధు జలాల ఒప్పందంను రద్దు చేసుకుంది.
అటారీ బార్డర్ ను క్లోజ్ చేసింది. పాక్ వాళ్లను మనదేశం నుంచి పంపించివేసింది. వారి వీసాల్ని రద్దు చేసింది. 16 యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసింది. గగన తలం నుంచి కూడా పాక్ విమానాలో పోకుండా.. నో ఫ్లైట్ జోన్గా ప్రకటించింది.ఈ క్రమంలో భారత్ అన్నివిధాలుగా పాక్ ఉగ్రకుట్రలకు ధీటుగా సమాధానం చెప్తుంది. మరోవైపు బార్డర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీగా ఆర్మీ బలగాలను భారత్ మోహరించింది.
ఈ క్రమంలో ప్రస్తుతం పహల్గం ఘటనపై పార్టీలకు అతీతంగా కేంద్రానికి తమసపోర్ట్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా..సెలబ్రీటీలు కూడా ఈ ఘటనపై స్పందింస్తున్నారు. తాజాగా.. బాలీవుడ్ హీరో.. ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
తాజాగా.. ఇమ్రాన్ హష్మీ చేసిన గ్రౌండ్ జీరో మూవీ విడుదలైంది. ఈ మూవీని పార్లమెంట్ పై దాడి ఘటన నేపథ్యంలో తీశారు. దీనిలో.. డిప్యూటీ కమాండెంట్ నరేంద్రనాథ్ ధర్ దూబే పాత్రలో ఇమ్రాన్ హష్మి చేశారు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి టాక్ వస్తుంది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి.. పవన్ కళ్యాన్ ఓజీలో, అడవి శేష్ జీ2 లో నటిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









