Thalapathy Vijay: చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు తలపతి విజయ్పై ఫిర్యాదు నమోదైంది. తమిళనాడు సున్నత్ జమాత్ అనే సంస్థ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలో మద్యం సేవించినవారు, సంఘ వ్యతిరేక శక్తులు హాజరయ్యారని, ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు.
విజయ్ నిర్వహించిన ఈ ఇఫ్తార్ వేడుకకు సంబంధం లేని వ్యక్తులు హాజరయ్యారని, అది మత పరంగా అభ్యంతరకరమని జమాత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మతపరమైన పవిత్రతకు భంగం కలిగించేదిగా ఈ కార్యక్రమం మారిందని, దీనిపై విజయ్ ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం ఆందోళన కలిగించిందని వారు తెలిపారు.
ఈ ఫిర్యాదులో విజయ్ తన రాజకీయ సభలలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విక్రవండి ప్రాంతంలో జరిగిన తొలి రాజకీయ సభలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు నీరసం, అస్వస్థతకు గురయ్యారని, ఇఫ్తార్ వేడుకలోనూ ఇదే విధంగా జరిగినట్లు వివరించారు.
విజయ్ తనకు విదేశీ భద్రతా సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారని, వారు స్థానిక సెంటిమెంట్స్ పట్ల అసంగతంగా వ్యవహరించారని జమాత్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడటానికి చట్టపరమైన చర్యలు అవసరమని వారు డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన వివాదాల మధ్య విజయ్ తన కొత్త చిత్రం 'జన నాయకన్' షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇది ఆయన 69వ చిత్రం కాగా, తరువాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళనున్నారని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









