Prashanth Neel: అక్కినేని అమలతో షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్..!

Amala With Prashanth Neel ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల అక్కినేని అమలతో కలిసి జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తనకు మాస్ సినిమాలంటే ఇష్టం లేదని, అయితే అలాంటి చిత్రాలే తెరకెక్కిస్తున్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాను ఎలాంటి చిత్రాలు చూస్తారో కూడా బయట పెట్టారు ఈ దర్శకుడు.. 

Written by - Vishnupriya | Last Updated : Mar 7, 2025, 05:58 PM IST
Prashanth Neel: అక్కినేని అమలతో షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్..!

Prasanth Neel Fav Movie
పాన్ ఇండియా సినిమాలకు మారుపేరుగా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ అనే భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించేలా ఉంటుందని నిర్మాత రవిశంకర్ ఇటీవల ప్రకటించారు. అయితే, ఇటీవల ప్రశాంత్ నీల్ అన్నపూర్ణ స్టూడియోస్ కాలేజీలో అక్కినేని అమలతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఆశ్చర్యకర సమాధానాలు ఇచ్చారు.  

Add Zee News as a Preferred Source

ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఉగ్రం, కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్ 1 వంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ చిత్రాలన్నీ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని భారీ విజయాలు సాధించాయి. అయితే, తనకు మాస్ సినిమాలు చేయడం ఇష్టమా? అనే ప్రశ్నకు ఆయన అందించిన సమాధానం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.  

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, "నేను ఇంట్లో టీవీలో సినిమాలు చూస్తే మాస్ సినిమాలు చూడను. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా చూస్తాను. ఇన్సెప్షన్ లాంటి సైఫై మూవీస్ నాకు చాలా ఇష్టం. అలాగే, లవ్ స్టోరీలు కూడా చూడగలనని చెప్పిన ఆయన, హమ్ అప్ కే హైన్ కౌన్ లాంటి ఫీల్గుడ్ మూవీస్ నచ్చుతాయని వెల్లడించారు. అయినా, కెజిఎఫ్ లాంటి యాక్షన్ సినిమాలు తాను తెరకెక్కించడం ఆశ్చర్యకరమే" అని చెప్పుకొచ్చారు.  

ప్రశాంత్ నీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన మీద చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు ప్రభావం చూపాయని వెల్లడించారు. తెలుగు సినిమాల్లో హీరో ఎలివేషన్, మాస్ యాక్షన్ సన్నివేశాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, అందుకే అలాంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నానని చెప్పారు.  

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న డ్రాగన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.  

ప్రశాంత్ నీల్ మాస్ సినిమాలు తక్కువగా చూస్తానని చెప్పడం సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. కానీ, ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా, అవి బ్లాక్‌బస్టర్ హిట్స్ అవ్వడం గమనార్హం. మరి, డ్రాగన్ లో ఆయన ఏమైనా కొత్త తరహా ప్రయోగాలు చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖ‌లో నూత‌న అధ్యాయం

Also Read: Double Bedroom Scheme: డబుల్ బెడ్రూమ్‌ పేరిట ఘరానా మోసం.. 200 మంది లబోదిబో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News