)
Kerala High Court stay on Shweta menon case: మలయాళ నటి శ్వేత మీనన్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటికే మార్టిన్ మేనచెరి అనే సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో ఆమెపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటనతో మరోసారి సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. ముఖ్యంగా.. శ్వేత మీనన్ నటించిన.. 'పలేరి మాణిక్యం', 'రతినిర్వేదం', 'కాళిమన్ను' వంటి సన్నివేశాలతో పాటు, కండోమ్ ప్రకటనలో కూడా చాలా వరకు అశ్లీలంగా ఉన్నాయని, దీనిలోని సన్నివేశాలు అభ్యంతరకంగా ఉన్నాయని ఫిర్యాదులో మార్టిన్ ప్రస్తావించారు.
ఇవి మహిళల్ని గౌరవానికి పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించాడు. ముందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెస్పాన్స్ కాలేదని, ఫిర్యాదు దారుడు ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వారిని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే.. అరెస్ట్ సమయంలో పోలీసులు పాటించాల్సిన కొన్ని నియమాల్ని పాటించలేదని నటి తరపు లాయర్లు కేరళ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ రోజు కోర్టులో దీనిపై వాదనలు జరిగాయి. ఈ క్రమంలో దీనిపై కేరళ హైకోర్టు పోలీసులపై సీరియస్ అయ్యింది.
ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో కూడా చట్టపరమైన చర్యలు, కొన్ని సెక్షన్లను అదనంగా జోడించడంపై కేరళ హైకోర్టు పోలీసులకు చివాట్లు పెట్టింది. నటి తరపున లాయర్ల వాదనతో కేరళ హైకోర్టు జస్టిస్ ఏకీభవించి కేసుపై స్టేను విధిస్తు ఆదేశాలు జారీచేశారు.
అదే విధంగా.. ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసే ముందు ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్కు.. ప్రాథమిక నివేదిక అందిందా లేదా అనేది స్పష్టం చేయాలని కూడా జస్టిస్ అరుణ్ తన మధ్యంతర ఉత్తర్వులో రిజిస్ట్రీని ఆదేశించారు.ఈ క్రమంలో కేరళ హైకోర్టు ఇచ్చిన స్టేతో.. మలయాళ నటికి మాత్రం శ్వేత మీనన్ కు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.