L2Empuraan: ‘ఎంపురాన్’ ట్రైలర్ చూడగానే తొడగొట్టాలని అనిపించింది.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

L2Empuraan: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎంపురాన్’. ‘లూసీఫర్’ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 01:35 AM IST
L2Empuraan: ‘ఎంపురాన్’ ట్రైలర్ చూడగానే తొడగొట్టాలని అనిపించింది.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

L2Empuraan:దిల్ రాజు మాట్లాడుతూ .. ‘లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మల్లూవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ గూస్ బంప్స్ తెపిస్తోంది. ట్రైలర్ ను అలా చూస్తూనే ఉండిపోయాను. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార్  పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు. కాదు అయిపోయారని చెప్పారు.  అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

Add Zee News as a Preferred Source

మాస్టర్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘ఎంపురాన్ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. నన్ను నమ్మి నాకు ఈ చిత్రంలో ఇంత మంచి క్యారెక్టర్  ఇచ్చిన పృథ్వీరాజ్ కి థాంక్స్. ఇంత పెద్ద చిత్రంలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.  సలార్ తరువాత ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని ఊహించలేదన్నారు.  మోహన్‌లాల్ గారితో నటించడం ఆనందంగా ఉందన్నారు. మార్చి 27న ఎంపురాన్ రిలీజ్ అవుతుంది.

కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ మాట్లాడుతూ .. ‘ఎంపురాన్ సినిమాకు పని చేయడం గర్వంగా ఉందన్నారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ గారితో పని చేయడం హ్యాపీగా ఉందన్నారు. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందన్నారు.  మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతోందన్నారు. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News