)
Manchu Lakshmi Instagram Account: సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల సోషల్ మీడియాను హ్యాక్ చేసి మరీ అందులో నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సైతం డబ్బులు అడుగుతూ వారిని బాధితులుగా మార్చేస్తూ ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తాజాగా మంచు లక్ష్మికి కూడా ఏర్పడింది. మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు.. యాక్టివ్గానే ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ నుంచి పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ ఉండే మంచు లక్ష్మి.. ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఐడి హ్యాక్ అయినట్లుగా తెలియజేసింది.
అయితే అలా హ్యాక్ చేసిన నేరగాళ్లు.. తన స్నేహితులను డబ్బులు అడుగుతూ.. ఉండడంతో ఈ విషయాన్ని గుర్తించిన మంచు లక్ష్మి తన ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. డబ్బులు కావాలి అంటే తానే డైరెక్ట్ గా అడుగుతానని, ఇక తన పేరుతో ఎవరో సైబర్ నేరగాళ్లు.. తన స్నేహితులను డబ్బులు అడుగుతున్నారని.. ఇవంతా కూడా అబద్ధమని..ఎవరు నమ్మవద్దని దయచేసి డబ్బులు ఎవరూ పంపించవద్దంటూ తెలియజేసింది.
మంచు లక్ష్మి నిరంతరం తన ఇంస్టాగ్రామ్ లో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటుంది.అందుకే హ్యాకర్లకు టార్గెట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని నిఖిల్ విజయేంద్ర సింహ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలియజేశారు. మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్ అయిందని.. కాబట్టి స్టోరీస్ లో.. పెట్టె పోస్టులు చూసి ఆమెకు డబ్బులు వెయ్యొద్దు అంటూ తెలియజేశారు.
మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో చాలా స్టోరీలు కనిపించడంతో ఫాలోవర్స్ కూడా ఇది మంచు లక్ష్మి చేసిన పని కాదు, హ్యాకర్ల పని అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe