Aditya 369 re release: తెలుగు సంవత్సరాది ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’.. గ్రాండ్ గా రీ-రిలీజ్ ఫంక్షన్..

Aditya 369 re release Function: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ఎవర్ గ్రీన్  క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. తాజాగా ఈ చిత్రాన్ని4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు మేకర్స్.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 28, 2025, 09:20 PM IST
Aditya 369 re release: తెలుగు సంవత్సరాది ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’.. గ్రాండ్ గా రీ-రిలీజ్ ఫంక్షన్..

Aditya 369 re release Function: ఆదిత్య 369 1991లో విడుదలై  సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు  ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా మార్చి 30, ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్ లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈయన ఈ సినిమా ముందు వరకు పలు చిత్రాలు తెరకెక్కించినా.. ఈ సినిమా తర్వాతే ఈయనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు దివంగత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పకుడిగా వ్యహరించారు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు.

Add Zee News as a Preferred Source

తెలుగులో తొలి టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణ దేవరాయలుగా.. కృష్ణ కుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.

ఈ సందర్భంగా ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్బంగా నిర్మాత   శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ గారు రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన  చిత్రం"ఆదిత్య 369". ఈ మూవీని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశామన్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గ ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారన్నారు  చక్కని థియేటర్లు కూడా లభించడంతో వైభవంగా రీ-రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999  మ్యాక్స్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు బాలయ్య రీసెంట్ గా ప్రకటించారు. మరోవైపు ఆదిత్య 369 తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ బాలయ్యతో .. వంశానికొక్కడు, భలేవాడివి బాసూ, మిత్రుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు.

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News