
ఈ మధ్యకాలంలో సినీ దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మైథాలజీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి జానర్స్ ను కలిసి తెరకెక్కించిన చిత్రం ‘త్రిబాణాధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సత్యరాజ్, వశిష్ట సింహా , ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీరాయ్, మేఘన వంటి ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేశారు. ఆగష్టు 29న విడుదల కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా.. లేదా అనేది చూడాలి.
కథ విషయానికొస్తే..
స్టోరీ విషయానికొస్తే.. ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్) తన మనవరాలు నిధి (మేఘన) మిస్ అవుతుంది. దాంతో కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళతారు శ్యామ్ కత్తు. అదే సమయంలో రామ్ (వశిష్ట ఎన్ సింహా) ఫారెన్ వెళ్ళడానికి రూ. 30 లక్షలు కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతనికి సత్య (సాంచీ రాయ్) అనే యువతి పరిచయమవుతుంది. అదే టైమ్ లో లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) అల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్) జూదానికి బానిసై దాసన్న (మొట్ట రాజేంద్రన్) వద్ద రూ. 15 లక్షలు అప్పు చేస్తాడు. బాల్య స్నేహితులైన రామ్, దేవ్ ఈ ఇద్దరూ కూడా తమ తమ సమస్యలోంచి ఎలా బయటపడ్డారు..? వారికి కావాల్సిన ఆ డబ్బుని సంపాదించడానికి వారు ఏం చేశారు..? తప్పిపోయిన నిధి దొరికిందా.. ? చివరకు ఏమైందనేదే అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు మోహన్ శ్రీవత్స ప్రస్తుతం మన సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇప్పటి యూత్ డ్రగ్స్ కు ఎలా బానిసవుతున్నారు. దాని వల్ల సమాజం ఎలాంటి దుష్ప్రభావాలకు లోను అవుతుందనేది ఈ సినిమాలో చూపెట్టారు. ప్రస్తుత యువత సన్మార్గంలో పైకి రావాలని కాకుండా.. ఎలాంటి పనులు చేసేైనా.. పైకి రావాలనునేవాళ్లు ఎక్కువగా పెరిగిపోయారు. ప్రస్తుత బర్నింగ్ ఇష్యూనే తన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’కు కథగా తీసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా డ్రగ్స్ కు బానిసై వాళ్లు మృగాల్లా ప్రవర్తిస్తూ తనతో పాటు సమాజాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచే కథనం ఆసక్తికరంగా ఉండేలా చేసుకున్నాడు. ఒక సన్నివేశం తర్వాత మరో సీన్ ను ఎంతో ఆసక్తికరంగా మలిచడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో సస్పెన్స్, ఉత్కంఠ రేకెత్తించలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకుని.. అన్ని వర్గాల ఆడియన్స్ను మెప్పించేలా రూపొందించారు. కొత్త దర్శకుడు తీసినట్లు ఎక్కడా అనిపించదు. మోహన్ తొలి చిత్రంతో ప్రేక్షకులను అలరించారని చెప్పుకోవచ్చు.
సెకండాఫ్ మరింత వేగంగా, పదునుగా పరిగెత్తుతుంది. నిధి మిస్సింగ్ కేసు, చివరకు మర్డర్ కేసుగా ఎలా టర్న్ తీసుకుంది. తాత ఆ కేసును ఎలా పరిష్కరించాడనే అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు ఆడియన్స్ ఊహలకు అందదు. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే కట్టిపడేస్తుంది. మొత్తంగా ఎమోషనల్ గా ఈ సినిమా ముగించడం విశేషం. నిర్మాత విజయ్ పాల్ అడిదల నిర్మాణ విలువలు బాగున్నాయి. కుశేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆర్ఆర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా సమాజంలోని బర్నింగ్ ఇష్యూను బాగానే టచ్ చేసాడు దర్శకుడు.
నటీనటుల విషయానికొస్తే..
సైకాలజిస్ట్ పాత్రలో సత్య రాజ్ నటన సినిమాకు మెయిన్ పిల్లర్. సత్యరాజ్ ఎంత గొప్ప నటుడో కొన్నిచోట్ల కేవలం హావభావాలతో తన నటనను ప్రదర్శించారు. రామ్ పాత్రలో వశిష్ట అద్భుత నటన కనబరిచారు. తన క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించాడు. చాలా కాలం తర్వాత ఉదయభాను తనకొచ్చిన పాత్రలో జీవించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం పక్కా అని చెప్పొచ్చు. కొత్త యాక్టర్ అయినా..క్రాంతి కిరణ్ తన నటనలో అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన తమ పాత్రల్లో జీవించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి