)
SC ST Case Against Vijay devarakonda: హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ఆయనకు అశనిపాతంగా మారాయి. పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే ఇప్పుడు భారత్, పాకిస్తాన్ దేశాలుకొట్టుకుంటున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని ఆ సంఘాలు ఆరోపించాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయిదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆయనపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్ లో సరైన కరెంట్ లేదు. భారత్.. పాకిస్థాన్ పై ఎటాక్ చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి దాడులు చేస్తున్నారని పాకిస్థాన్ ను ట్రైబల్స్ ను మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. దీనిపై విజయ్ దేవరకొండ బహిరంగ క్షమాపణలు చెప్పినా.. గిరిజనలు శాంతించ లేదు. అయితే గిరిజన సంఘాలు విజయ్ దేవరకొండ మాట్లాడిన క్లిప్పులను జత చేసి దీంతో అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వీడియోస్ అన్నింటిని పరిశీలించిన తర్వాత మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంతారావు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈయన హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జూలై 4న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైర్మెంట్, శ్రీకర ప్రొడక్షన్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.