Singer kalpana case update: సింగర్ కల్పన సూసైడ్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె KPHBలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాయి. ఘటన జరిగిందనే విషయం తెలియగానే.. ఆమె భర్త ప్రసాద్, కూతురు హైదరబాద్ కు చేరుకున్నారు. అదే విధంగా ప్రముఖ సింగర్స్ అంతా.. కల్పనను పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూలు కట్టారు.
ఇప్పటికే సింగర్ సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ప్రస్తుతం సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి ఆమె భర్త కారణం కావచ్చని అందరు భావించారు. కానీ అందరికి షాక్ కు గురిచేసేలా కల్పన అసలు విషయంను పోలీసులకు చెప్పారు. డాక్టర్లు పర్మిషన్ తో పోలీసులు సింగర్ కల్పనతో కొద్దిసేపు మాట్లాడారు. అసలు ఆత్మహతకు ఎందుకు ప్రయత్నించారని పోలీసులు ప్రశ్నించారు. దీంతో కల్పన మెల్లగా అసలు నిజంను బైటపెట్టారు. తన పెద్ద కూతురు కేరళలో ఉంటుందని ఆమెను హైదరబాద్ కు వచ్చేయాలని కోరినట్లు కల్పన చెప్పారు .
కానీ తన కూతురు మాత్రం ఎన్ని చెప్పిన కూడా హైదరాబాద్ కు వచ్చేందుకు ససేమీరా అన్నారు. దీంతో తమమధ్య వాగ్వాదం జరిగిందని కల్పన పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో చెప్పింది. ఈ క్రమంలో కోపంలో తాను.. జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని తీసుకున్నట్లు కల్పన పోలీసులకు ఇచ్చిన తాజాగా స్టేట్ మెంట్ లో వెల్లడించారు. దీంతో ఈ కేసులో ఇది బిగ్ ట్విస్ట్ గా చెప్పుకొవచ్చు. ప్రస్తుతం సింగర్ కల్పన హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









