Tollywood Hero: ట్రైన్‌లో తెలుగు స్టార్ హీరో కి ఫస్ట్ నైట్‌ ఏర్పాటు చేసిన దర్శకుడు..!

Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాస్ ఆడియెన్స్‌ను ఆకర్షించడంలో దిట్ట. ఆయన ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖల ఫస్ట్ నైట్‌ను ట్రైన్‌లో ఏర్పాటు చేయించిన సంగతి తెలుసా?  అవును మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Mar 3, 2025, 05:40 PM IST
Tollywood Hero: ట్రైన్‌లో తెలుగు స్టార్ హీరో కి ఫస్ట్ నైట్‌ ఏర్పాటు చేసిన దర్శకుడు..!

Chiranjeevi first night : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల్లో తన ప్రత్యేకమైన స్టైల్‌కు పేరు గాంచాడు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లను ఆయన ఎంతో అందంగా చిత్రీకరించేవాడు. ఆయన పాటల్లో పూలు, పండ్లు వాడకం సర్వసాధారణం. ఈ ప్రత్యేకత వల్లే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. కానీ మీరు ఎప్పుడైనా ఒక స్టార్ హీరో ఫస్ట్ నైట్‌ను ట్రైన్‌లో ప్లాన్ చేసిన దర్శకుడి గురించి విన్నారా? అదే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఓ ఆసక్తికరమైన పని.  

Add Zee News as a Preferred Source

Chiranjeevi Marriage ;మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభదశలో ఉన్నప్పుడే, ఆయన భవిష్యత్‌ను అంచనా వేసిన సినీ ప్రముఖులు ఆయనకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. సీనియర్ నటుడు అల్లూరామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చేందుకు ఒప్పించారు. కానీ అప్పటికి చిరంజీవి ఒక సంవత్సరంలో 14 సినిమాలు చేయాల్సినంత బిజీగా ఉండేవారు.  

Chiranjeevi and Surekha ;పెళ్లి కార్యక్రమాలు కేవలం మూడు రోజుల్లో పూర్తయ్యాయి. ఒక రోజు నిశ్చితార్థం, మరుసటి రోజు వివాహం, మరుసటి రోజు ఇతర సంప్రదాయ కార్యక్రమాలు. అయితే, చిరంజీవికి పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ఆస్వాదించే సమయం దొరకలేదు. వెంటనే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది.  

చిరంజీవి పెళ్లి జరిగిన వెంటనే, ఆయన రాఘవేంద్రరావు సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. షూటింగ్ ముగిసిన తర్వాత, చిరంజీవి చెన్నై వెళ్ళే ట్రైన్‌లో ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడే Raghavendra Rao ఓ ఆసక్తికరమైన ప్లాన్ వేశాడు. ఆ ట్రైన్‌లో ప్రత్యేకంగా ఒక బెర్త్ బుక్ చేసి, దాన్ని పూలు, పండ్లతో శుభకార్యానికి తగినట్లు డెకరేట్ చేయించాడు. ఇది పూర్తిగా చిరంజీవికి తెలియకుండా సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేశారు. ట్రైన్ ఎక్కిన తర్వాతే చిరంజీవి, సురేఖకు విషయం తెలిసింది. ఇది పూర్తిగా చిత్రపటంలో వచ్చే సన్నివేశంలా అనిపించింది.  

ఈ విషయాన్ని చిరంజీవి, సురేఖ ఇప్పటికీ మరిచిపోలేదట. వారు ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఈ ఆసక్తికరమైన సంఘటనను చిరంజీవి ‘సౌందర్య లహరి’ టాక్ షోలో వెల్లడించడం గమనార్హం.

Also read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు, దుబాయ్ పిచ్ రిపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News