Vishnupriya Arrest: బెట్టింగ్ యాప్స్పై కొరడా ఝులిపిస్తున్నహైదరాబాద్ పోలీసులు వీటిని ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలను టార్గెట్ చేశారు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, సన్నీలకు విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేయగా ఇవాళ విష్ణుప్రియ విచారణ ముగిసింది.
పంజాగుట్ట పోలిస్ స్టేషన్కు విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియను పోలీసులు చాలా అంశాలపై ప్రశ్నించారు. ఈ విచారణలో కీలకాంశాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. దాదాపు 4-5 గంటలు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సుదీర్ఘంగా వివరాలు సేకరించారు. అనంతరం ఆమె ఫోన్ సీజ్ చేశారు. విష్ణుప్రియకు బెట్టింగ్ యాప్స్తో ఉన్న లావాదేవీలు, ఫోన్ కాల్స్ వంటి అంశాలపై లోతుగా విచారించేందుకు వీలుగా ఆమె ఫోన్ సీజ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఆమెను అదుపులో తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసినవారికి విచారణకు నోటీసులు జారీ చేయడమ కాకుండా హాజరయ్యేందుకు కోరిన సమయం ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణకు హాజరుకాకుంటే మాత్రం అరెస్టు చేస్తామని చెప్పారు. ఇవాళ జరిగిన విచారణకు విష్ణుప్రియ తన అడ్వకేట్తో కలిసి హాజరైంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని విచారించారు. మరో 8 మందిని విచారించాల్సి ఉంది. ప్రమోషన్ల వెనుక ఎవరున్నారు, డబ్బులు ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









