)
Viraatpalem in Zee OTT:
ఇండియాలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒకటైన జీ-5 కూడా ఒకటి. ఇందులో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు, వెబ్ సిరీస్ లు హర్రర్, థ్రిల్లర్ వంటివి స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. అయితే రేపటి రోజున Zee -5లో మరొక థ్రిల్లర్ సిరీస్ రాబోతున్నది..
ఆ సీరీస్ ఏదో కాదు విరాటపాలెం. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన అభిజ్ఞ ఊతలూరు ప్రధాన పాత్రలో ఈ సిరీస్లో నటిస్తూ ఉన్నారు.ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
P.C. మీనా రిపోర్టింగ్ విరాటపాలెం ట్రైలర్ విషయానికి వస్తే.. విరాట పాలెం అనే గ్రామంలో ఒక శాపం ఉంటుంది.. ఆ ఊరిలో వివాహమైన మరుసటి రోజు పెళ్లికూతురు మరణిస్తూ ఉంటుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని ఆ శాపం వెంటాడుతూ ఉంటుందనే భావనలో ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆ ఊరికి ఒక మహిళ కానిస్టేబుల్ మీనా (అభి) వస్తారు..
ఊరి ప్రజలు నమ్ముతున్న మూఢనమ్మకాన్ని ఆ ఊరి లోపల ఉన్న రహస్యాలని పటాపంచలు చేయడానికి మీనా కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మరణాల వెనుక దాగి ఉన్న మిస్టరీ బయటపడిందా?.. మీనా ప్రజలను ఈ భయం నుండి బయటపడేసిందా? లేదా? అనే విషయం తెలియాలి అంటే రేపటి రోజు వరకు ఆగాల్సిందే.
విరాటపాలెం సిరీస్ ను డైరెక్టర్ పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈనెల 27న జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. చరణ్ లక్కరాజు, రామరాజు, లావణ్య సాహూకర, సతీష్, గౌతమ్ రాజు వంటి వారు కీలకమైన పాత్రలు నటించారు.. మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఆకట్టుకుందో రేపటి రోజున తెలుస్తుంది.
You May Like
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook