
Yoga Day Fight:
జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే గా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నంలో ఈ యోగా డే ని గ్రాండ్గా నిర్వహించారు. ఇక యోగ దినోత్సవ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడంతో విశాఖ సాగర తీరాన జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు.
అలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బ్రాహ్మిణి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ లతోపాటు కేంద్ర మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే దగ్గర కనిపించడంతో పెద్ద ఎత్తున జనాలు కూడా ఈ ఈ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమం పూర్తిచేసుకుని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ లు వెళ్లిపోయాక అక్కడున్న జనాలు యోగా చేసిన మ్యాట్ లు తీసుకోవడానికి పెద్ద ఎత్తున గుమిగూడారు.
అంతేకాదు ఒక్కొక్కరు 10,15 మ్యాట్ లు తీసుకున్నారు. ఇక కొంతమందేమో ఒకరి చేతిలో నుండి మరొకరు లాక్కొని వెళ్లారు.అయితే ప్రస్తుతం యోగా మ్యాట్ల గురించి అక్కడున్న జనాలు గొడవ పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియో చూసి మరీ ఇంత కకృత్తా.. కనీసం యోగా మ్యాట్లను కూడా వదలడం లేదుగా..
అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఇంకొంతమందేమో ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు.. అలాంటిది యోగా మ్యాట్లు వదులుతారా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఏపీలో జరిగిన యోగా డే సెలబ్రేషన్స్ తర్వాత అక్కడున్న జనాలు మ్యాట్ల కోసం కొట్టుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
You May Like
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook