
viraatapalem pc meena reporting‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే త్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జీ5. కృష్ణ పోలూరు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని చెబుతున్నారు. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో ప్రీమియర్ కానుంది. ఈ వెబ్ సిరీస్ 1980 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కించారు. విరాటపాలెంట అనే గ్రామం చుట్టు తిరిగే కథ ఇది. ఆ ఊరికి ఓ శాపం ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంటారు. , దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో స్టోరీ రన్ అవుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోన్నట్టు చెప్పుకొచ్చారు.
మూఢనమ్మకాలతో ఓ శక్తివంతమైన సందేశంతో థ్రిల్లింగ్ ఎలిమమెంట్స్ తో ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం పక్కా అని చెబుతున్నారు. ఇది కేవలం సూపర్నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు. భయం, సత్యం మధ్య జరిగే ఓ యుద్ధం. జూన్ 27 నుండి ZEE5లో మాత్రమే ప్రసారం అయ్యే ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ తప్పక చూడండి.
ZEE5 తెలుగు బిజినెస్ హెడ్ - అనురాధ గూడూర్ మాట్లాడుతూ.. ‘ZEE5లో కామన్ ప్రజలకు అవసరమైన కంటెంట్ అందిస్తోంది. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనేది ఉత్కంఠను కలిగిస్తూనే సందేశాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రిస్తుందో.. ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా డిస్ట్రబ్ చేస్తుందో ఈ సిరీస్ చూపిస్తుందన్నారు.
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా ZEE5 బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా ‘విరాట పాలెం’ అనేది పూర్తి గ్రామీణ వాతావరణంలో ప్రకృతి సోయగాల నడమ తెరకెక్కించారు. గ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్గా సాగే ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ఖాయం.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ* .. ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేయడమనేది ఈ సిరీస్ లో అతిముఖ్యమైనదిగా పేర్కొన్నారు.
*సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ* .. ‘‘రెక్కీ’ విజయం తర్వాత, ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ కోసం మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం బాగుందన్నారు. ఈ స్టోరీ నాకు మొదటి నుంచీ ప్రత్యేకం. టీవీల కోసం కథలను క్రియేట్ చేయడం..పాత్రలను పోషించడం కోసం యేళ్లుగా గడిపిన వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ నాకు మరింత ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడిందన్నారు. అందరిలాగే ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్లో నటించడం హ్యాపీగా ఉందన్నారు. ఈ పాత్ర చేయడం ఓ ఛాలెంజింగ్.ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్ర తనదని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు ఈ సిరీస్ తప్పక ఎంగేజ్ చేస్తుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook