సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఓ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళ బుల్లితెర నటి నీలాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం వెనుక మీడియాలో వస్తున్న కథనాలు కూడా కారణమేనని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు చెన్నైలోని బుల్లితెర నటి నీలాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. సకాలంలో ఆమెను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తనను వివాహం చేసుకోవాలని సహాయ దర్శకుడు లలిత్ కుమార్ వేధిస్తున్నాడని గతంలో ఆమె పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లలిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఆ ఆత్మహత్యకు కారణం నీలాని అని ఆరోపించసాగారు. పలు మీడియా సంస్థలు కూడా ఇదే కోణంలో కథనాలు ప్రసారం చేశాయి. ఈ క్రమంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని చెబుతూ.. నీలాని ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు వస్తున్న కారణం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించాల్సి వచ్చిందని నీలాని తెలపడం గమనార్హం. 


ఈ సందర్భంగా నీలాని మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ అవుతుందని... తనను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని.. నెటిజన్ల వ్యాఖ్యలు తనను ఎంతగానో కుంగదీస్తున్నాయని.. అందుకే ఆ బాధ భరించలేకే ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. వలసరవక్కం ప్రాంత నివాసైన నీలాని పలు టీవీ సీరియళ్లలో నటించారు. ఆమె బాయ్ ఫ్రెండ్ లలిత్ కుమార్ తనకు తాను నిప్పంటించుకొని మరణించారు. ఆ ఘటనకు నీలానినే బాధ్యురాలినే చేస్తూ నెటిజన్లు ఆమెను దూషించడం ప్రారంభించారు.