
Erra Cheera The Beginning: శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎర్ర చీర ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకి త్వరలోనే రాబోతోంది. ఈ మూవీ బేబి డమరి సమర్పణలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో తెలుగు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ స్వయాన మనవరాలు సాయి తేజస్విని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. అలాగే దర్శకుడు సుమన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హర్రర్ తో పాటు సెంటిమెంట్ యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం ఈ శివరాత్రికే ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడాల్సి వచ్చింది.. అయితే వేసవి సందర్భంగా, చిత్ర బృందం ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన పలు ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలలో ఒకరైన NVV సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఈ మూవీలో ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలామంది ఆ ఘోరాలతో.. ఆ మహా శివుడిని అద్భుతంగా చూపిస్తూ కనిపించే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.. కుటుంబంతో కలిసి ఎంతో చక్కగా ఈ సినిమాను చూడవచ్చు.. అని ఆయన అన్నారు..
అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుమన్ బాబు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.. ఈ సినిమాలో చివరి 45 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ సీన్స్ అత్యద్భుతం.. ఇవి చాలా హైలెట్గా నిలుస్తాయి.. ఇప్పటికే సినిమా చూసిన చాలామంది అద్భుతంగా ఉందని ప్రశంసించారు.. కంటెంట్ మాత్రం ఖతర్నాక్ ఉందని అందరు మెచ్చుకున్నారు.. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుందని నేను నమ్ముతున్నాను.. అని ఆయన అన్నారు.. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి