)
Jubilee Hills Nominations: డబ్బు ప్రభావం లేనటువంటి స్వచ్ఛమైన ఎన్నికలు రావాలని.. సమాజంలో మార్పు జరగాలని ఆకాంక్షిస్తూ సమాజ సేవలో భాగమైన ఓ సామాజిక కార్యకర్త జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచాడు. ప్రజల కోసం పని చేసే వ్యక్తులనే ఎన్నుకోవాలని కోరుతూ ఉప పోరులో దిగాడు. పోటీలో దిగేందుకు వేసిన నామినేషన్లోనే ప్రత్యేకత చాటాడు. ఆన్లైన్లో నామినేషన్ వేసిన మొదటి నాయకుడిగా నిలిచాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందాం.
హైదరాబాద్లో నివసిస్తున్న డాక్టర్ కె వీర భోగ వసంత రాయలు సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నారు. రాజకీయాలు.. సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వసంత రాయలు ఎన్నికలను తన ఆయుధంగా చేసుకుంటున్నారు. డబ్బు ప్రభావం లేని స్వచ్ఛమైన ఎన్నికలు జరగాలని.. ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులనే ఎన్నుకోవాలని కాంక్షిస్తూ గతంలో మునుగోడు, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లో జరుగుతున్న ధన ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించి స్వచ్ఛమైన రాజకీయాలకి నాంది పలకాలని పోరాడుతున్నాడు.
ఈ క్రమంలోనే వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వసంత రాయలు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని వినియోగించుకున్న తొలి వ్యక్తిగా నిలవగా.. ఎన్నికల అధికారి అభినందించారు. నామినేషన్ సందర్భంగా అశ్వరథంపై ఉరేగింపుగా వచ్చి వచ్చాడు. ఈ సందర్భంగా శాలివాహన చక్రవర్తి గెటప్లో వసత రాయలు ప్రత్యేకంగా నిలిచారు.
'ప్రభుత్వాలు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడానికి మొగ్గు చూపకపోవడం చాలా దుర్మార్గమైన అంశం. శాలివాహనులైనటువంటి కుమ్మరి సమాజానికి సమానమైన వాటా ఇవ్వాలి. అన్ని రాజకీయ పదవుల్లో.. రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించాలి' అని వీర భోగ వసంతరాయులు డిమాండ్ చేశారు. తాను సమాజంలో చైతన్యం కోసం రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూనే ఉంటానని ప్రకటించారు. ఓటర్లు తనకు ఓటు వేసి నూతన రాజకీయాలకు నాంది పలకాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి