)
Jubilee Hills With BRS: 'జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. వంద రోజులు కాదు, 700 రోజులు దాటినా అమలు చేయడం లేదు. అందుకే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుతున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు. లేకుంటే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా.. హామీలు అమలు చేయకపోయినా.. హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూల్చినా నాకే ఓటు వేశారని రేవంత్ అంటాడని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, మాగంటి సునీత గెలవాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేశాడు. కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే.. అత్యంత అవినీతి రాష్ట్రంగా తయారు చేశారు. భవన నిర్మాణానికి స్క్వేర్ ఫీట్కు రూ.75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమీషన్ ఇవ్వాలట. ఇళ్లు జాగ, భూముల సమస్యలు పరిష్కారం కావాలంటే 40 శాతం భూములు రాసివ్వాలట. మొత్తం పర్సెంటేజీలు డిసైడ్ చేశాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
'ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకం ప్రారంభించేది. తెలంగాణ అనుసరిస్తే, దేశం ఆచరించేది. ఒక రాష్ట్రం ఎట్ల ఉండాలో కేసీఆర్ గారు తయారు చేస్తే, రాష్ట్రం, సీఎం ఎట్ల ఉండగూడదో రేవంత్ రెడ్డి తయారు చేశాడు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించారు.. ఉచితంగా పరీక్షలు చేసే విధంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ప్రారంభించారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టించాడని పేర్కొన్నారు. ఆరు నెలలుగా బస్తీ దవాఖానాల వైద్య సిబ్బంది జీతాలు చెల్లించడం లేదు.. మందులు లేవని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'వాళ్లకు జీతాలు ఇవ్వకుండా మీకు వైద్య సేవలు అందకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. బస్తీ దవాఖానాలు చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తారు.. కాబట్టి బస్తీ దవాఖానాల ఉనికి లేకుండా చేస్తున్నాడు. నీళ్ల బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 20 వేల లీటర్ల వరకు బిల్లులు లేవు. రేవంత్ వచ్చాడు బిల్లులు వసూలు చేస్తున్నారు' మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది మాగంటి సునీతమ్మ గెలుపు మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు అని పేర్కొన్నారు. మహాలక్ష్మి రాని అక్కా చెల్లెల్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు అని హరీశ్ రావు ప్రకటించారు.
'రేవంత్ రెడ్డి ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు.. ప్రభుత్వం పోదు. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలె. హైడ్రా పెట్టి పెద్దోళ్ల ఇళ్లు కూల్చుతలేడు గానీ, పేదోళ్ల ఇండ్లు కూల్చుతున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చీఫ్ విప్ గాంధీ ఇండ్లు, భూములు హైడ్రాకు ఎందుకు కనబడడం లేదు. గరీబోళ్ల ఇండ్లే హైడ్రాకు కనబడుతున్నాయా? హైడ్రా కతం హోనాహే.. కాంగ్రెస్ కో హరానేహే హైడ్రా బంద్ హోనా తో .. మాగంటి సునీతమ్మకో జితానాహే' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తదని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి