)
Hyderabad new Commisionar of Police Sajjanar: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలొ తనదైన మార్క్ చూయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అన్నిశాఖల్లో అధికారుల్ని తరచుగా మారుస్తు , పారదర్శకమైన పాలన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎస్ లు, ఐఏఎస్ లను సైతం వారికి స్థానచలనం కల్పిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి.. అధికారులు సమర్ధవంతులైన ప్రజలకు ప్రభుత్వ ఫలాలు ఈజీగా అందుతాయని, ఎలాంటి సమస్యలు ఉండవని తరచుగా చెబుతు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా శాంతి భద్రతలపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా.. తెలంగాణ డీజీపీలతో పాటు, హైదరాబాద్ కు కమిషనర్ లను కొత్తగా నియమించారు. హైదరాబాద్ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించారు. అదే విధంగా సీపీగా సజ్జనార్ ను నియమించారు.
ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో తరచుగా హత్యలు, మాన భంగాలు, పబ్లిక్ గా నరుక్కొవడం వంటి ఘటనలు ఎక్కువగా మారాయి. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న డ్రగ్స్ దందా రహస్యంగా నడుస్తునే ఉంది.
అయితే.. తాజాగా.. సీపీగా బాధ్యతలు తీసుకున్న సీపీ సజ్జనార్ ముఖ్యంగా హైదరాబాద్ లోని రౌడీషీటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
శాంతి భద్రతలు తమ ప్రథమ కర్తవ్యమన్నారు. రౌడీషీటర్లు పేట్రెగిపోతే.. పీడీయాక్టులు తెరుస్తామన్నారు. ముఖ్యంగా సైబర్, ఆర్థిక నేరాల కట్టడికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు.
మరోవైపు సీపీ సజ్జనార్ కు ఇప్పటికే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుస్తారు. గతంలో వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.
ఆ తర్వాత హైదరాబాద్లో దిశ ఫార్మసీ యువతి ఘటనలో కూడా నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం సీపీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించడంతో నేరస్థులకు సింహా స్వప్నంగా మారారరి చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి