)
Pm modi comments on cm Revanth reddy govt in hicc meeting in hyderbad: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ పర్యటనకు రావడంతో ఈ కార్యక్రమంను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రులు, మంత్రులు హైదరాబాద్ లోని హెచ్ఐసీపీలో పలు డెవలప్ మెంట్ పథకాలను వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రేవంత్ జీ ఇటువినండి అంటూ.. తెలంగాణకు రోడ్లు, రైల్వేలో ఎంత కేటాయించామో ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. రాష్ట్రంలొ రైలు, రోడ్డు కనెక్టివిటీని బాగా పెంచామన్నారు. అంతే కాకుండా, కేవలం రోడ్డ నిర్మాణంకు రూ . 2 లక్షల కేటాయించామన్నారు. దీని వల్ల తెలంగాణకు లాభం చేకూరిందన్నారు.
ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం రూ. వెయ్యి కోట్లిస్తే, తెలంగాణకు ప్రస్తుతం రూ.5,500 కోట్లిచ్చామన్నారు. 5 వందే భారత్ ట్రైన్ లు, 6 భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఇచ్చామన్నారు. తాను గుజరాత్ కు పదేళ్లలో కేటాయించిన నిధుల్ని తెలంగాణకు కేటాయించడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఇలా చేస్తే ప్రస్తుతం ఇచ్చిన దానిలో సగం అవుతుందన్నారు. మీరు అనుకుంటున్న ప్రగతిని సాధించాలంటే తమతో కలిసి నడిస్తేనే సాధ్యమౌతుందన్నారు. మేరేసే జోడో అంటూ సీఎం రేవంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణతో పాటు, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రాక ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అన్ని విధాలుగా తెలంగాణను దోచుకున్నాయని ట్విట్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలన అందిస్తుందని ఘాటుగా ఆరోపణలు చేశారు. కనీసం ఒక్కరోజు కూడా గడవక ముందే మేరేసే జోడో అంటూ మోదీ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటని తెలంగాణ రాజకీయాల్లో హట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరచుగా కాంగ్రెస్ , బీజేపీలది ఫెవికాల్ బంధం అని, బడే భాయ్, ఛోటే భాయ్ బంధం అని తరచుగా విమర్శలు చేస్తునే ఉంది.
హెచ్ఐసీసీ సమావేశంలో ప్రధాని మోదీ స్వయంగా మేరే సే జోడా అనడం తీవ్రచర్చనీయాంశంగా మారింద. ఒక వేళ ఇది తెలంగాణ డెవలప్ మెంట్ కోసమా లేదా భవిష్యత్ లో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయడం కోసం ఈ సభతోనే మోదీ బలమైన బీజం వేశారా..?.. అన్నదానిపై రక రకాల ఊహాగానాలు, చర్చలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్యను పెంచుకుంటు కాషాయం పార్టీఫుల్ జోష్ లో ఉంది.
అంతే కాకుండా ఒకవేళ కాంగ్రెస్ బీజేపీతో కలిస్టే మరింత తొందరగా తెలంగాణ డెవలప్ మెంట్ సాధ్యమౌతుందని ఒక మెస్సెజ్ ను ప్రధాని స్వయంగా ఈ సమావేశంలో ప్రజలకు అందరికి తెలిసేలా ఇచ్చారా??.. ఏంటని కూడా కొత్తచర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై హీట్ పెరిగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఏవిధంగా స్పందిస్తుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.