)
Jubilee Hills By Election: 'జూబ్లీహిల్స్లో సెంటిమెంటా? లేక డెవలప్మెంటా? అన్నది ప్రజలు ఆలోచించాలి. సెంటిమెంట్ పేరుతో ఓటు అడిగే హక్కు కేసీఆర్కు లేదు. పీజేఆర్ చనిపోయినప్పడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. ఎమ్మెల్యే ఏ చనిపోతే ఏకగ్రీవం కాకుండా ఉప ఎన్నికలకు నాంది పలికింది కేసీఆర్. బీఆర్ఎస్ నాయకులు బెంజ్ కారు వదిలి ఆటోలో తిరుగుతూ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్లో సమస్యలకు కారణం బీజేపీ, బీఆర్ఎస్ కారణం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం జూబ్లీహిల్స్లో 3 నెలల్లో రూ.400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టింది. నవీన్ యాదవ్ని గెలిపిస్తే నియోజవర్గ అభివృద్ధి జరుగుతుంది. పదేళ్లలో కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతాడు. జూబ్లీహిల్స్లో 2 లక్షల 39 వేల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజులలో జూబ్లీహిల్స్లో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం అవినీతిపైన సీబీఐ విచారణ కోరితే మోదీ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు బొక్కలో వేయడం లేదని మోదీని, కిషన్ రెడ్డి నిలదీయడం లేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మూసీనది అభివృద్ధికి, త్రిబుల్ ఆర్కు అడ్డుపడుతున్నాడని.. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్కు అలవాటుగా మారిందని చెప్పారు. గతంలో నేను వైట్ ఛాలెంజ్ విసిరితే రాకుండా పారిపోయాడని వివరించారు. కంటోన్మెంట్లో రూ.4000 కోట్ల అభివృద్ధి పనులు జరగలేదని.. నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరాడు అని వివరించారు.
'కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూ.5000 కోట్ల జీఓలు చూపిస్తే కేటీఆర్ పారిపోయాడు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు. నవీన్ యాదవ్ విజయం కోసం ఎంఐఎం నేతలు కష్ట పడి పని చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నవీన్ యాదవ్కు మొదట ఎంఐఎం ఎమ్మెల్యే ఏ టికెట్ ఇచ్చింది? అని ప్రశ్నించారు. సిరాజ్ కోసం అన్ని నిబంధనలు పక్కన పెట్టి డీఎస్పీగా అవకాశం ఇచ్చామని తెలిపారు. నిఖత్ జరీన్ను కూడా డీఎస్పీగా నియమించామని.. హజారుద్దీన్ను మంత్రిని చేశామని వివరించారు. హజారుద్దీన్ను మంత్రిని చేస్తే కిషన్ రెడ్డికి ఏం ఇబ్బంది? అని ప్రశ్నించారు.
'ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం. మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం అంతా ఒక్కటే! మేం ఎలాంటి తారతమ్యం చూపించం. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓటు అడుగుతుంది' రేవంత్ రెడ్డి తెలిపారు. 'కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో కేసీఆర్కు చర్లపల్లి జైలులో పంపిస్తారని కిషన్ రెడ్డి అన్నాడు. విచారణకు ఆదేశించి 3 నెలలు అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు? జూబ్లీహిల్స్లో మోదీ, కేసీఆర్ ఒక వైపు.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, హజారుద్దీన్ మరో వైపు' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి