)
Jubilee Hills By Election: 'జూబ్లీహిల్స్లో గెలవలేమని కాంగ్రెస్ కార్యకర్త మొదలు రేవంత్ రెడ్డి వరకు అర్థమైంది. ఏం చేయాలో పాలుపోక మతం, కులం విషయంలో కింది స్థాయికి వెళ్లి రాజకీయం చేస్తున్నారు' ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. మనిషికి ఓ కులాన్ని ఎత్తుకొని మంత్రులు కుల పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులానికి, రాజకీయ పదవులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు తానే గ్లాడియేటర్నని చెప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో గురువారం ఎమ్మెల్సీ తాతా మధు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తుమ్మల ఓడిపోయి పామాయిల్ తోటలో ఉంటే కేసీఆర్ పిలిచి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. స్థాయిని పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాజకీయం చేయడం తుమ్మలకు తగదు' అని హితవు పలికారు. మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే కూడా తుమ్మల చిల్లరగా మాట్లాడారని ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు.
'మాగంటి సునీతపై దుర్మార్గమైన ప్రచారం మొదలుపెట్టారు. మాగంటి సునీతకు అందరి దీవెనలు ఉండడంతో జూబ్లీహిల్స్లో గెలుపు ఖాయం' అని ఎమ్మెల్సీ తాతా మధు ధీమా వ్యక్తం చేశారు. 'ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరణ చేయవద్దని అడ్డుకున్న నేతలను పక్కన పెట్టుకొని మైత్రీవనంలో పెడతామని మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఏం అభివృద్ది చేశారో, హామీలు అమలు చేశారో చెప్పాలి. కమ్మ సామాజిక వర్గానికి ఖానామెట్ లో ఐదెకరాల భూమి ఇచ్చారు. ఎన్టీఆర్పై అత్యంత అభిమానం ఉన్న నాయకుడు కేసీఆర్, కుమారుడికి కూడా పేరు పెట్టారు' అని గుర్తుచేశారు. ఎన్టీఆర్తో ప్రారంభమైన సామాజిక విప్లవం తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణమైంది అని ఎమ్మెల్సీ తాతా మధు ప్రకటించారరు.
'జూబ్లీహిల్స్లో గోపీనాథ్ కులాలకు అతీతంగా అభివృద్ధి చేశారు. అసలు కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు?' అని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ను అద్భుతంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం తగదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. కమ్మ సామాజిక వర్గం వారు కూడా ఆలోచన చేయాలని సూచించారు.
'పదేళ్లు మాగంటి గోపీనాథ్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఏ గల్లీకి వెళ్లినా మాగంటి గోపీనాథ్ పేరిట శిలాఫలకం కనిపిస్తుంది. మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొడతారు' అని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దేదీప్య, మందాడి శ్రీనివాస్ రావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి