)
Telangana Summit: ఎంతో గొప్ప లక్ష్యంతో తాము ముందుకు వెళ్తున్నట్లు తెలంగాణ సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు తరాల కోసం పాలసీ డాక్యూమెంట్ గా జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలను మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047గా పిలుస్తున్నట్లు వెల్లడించారు. విజన్, స్ట్రాటజీ అనే రెండు అంశాలు ఉంటాయని చెప్పారు.
గ్లోబల్ సమ్మిట్పై మంత్రులతో చర్చించిన అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్లో లక్షలాది మందిని భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. నీతి ఆయోగ్, ఐఎస్బీలాంటి సంస్థల సహకారంతో డాక్యుమెంట్ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
'తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని మొత్తం ప్రణాళిక బద్దమైనఅభివృద్ది కోసం కోర్ అర్భన్ రీజన్ ఎకానమిగా చూస్తున్నాం. కాలుష్య రహిత సిటీ గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మెట్రోపాలిటన్ సిటీలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కోర్ అర్భన్ రీజన్ను సర్వీస్ సెక్టర్ట్గా మారుస్తున్నాం. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కోర్ అర్భన్ రీజన్ నుంచి తరలిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'కోర్ అర్భన్ రీజన్లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అవుటర్ రింగ్ అవతలి భాగంలో రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్లు 360 కిలోమీటర్ల దూరం ఉండనుంది. పెరీ అర్భన్ రీజనల్ ఎకానమిగా దీన్ని పిలుస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ప్యూచర్ సిటీతోపాటు అనేకం ఈ రీజనల్లో ఉంటాయని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హై వే, బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నట్లు ప్రకటించారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకువస్తున్నట్లు, తెలంగాణలో ఇంకా ఎయిర్ పోర్టులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వరంగల్ ,ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండం లో ఎయిర్పోర్టులు తీసుకువస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
'హైవే, పోర్ట్, ఎయిర్ర్టు కనెక్టివిటీతో పెట్టుబడులు తీసుకువచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు మూడో రీజియన్ గా చూస్తున్నాం. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయం.. రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతులను భాగస్వాములను చేస్తాం' అని మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలమని.. క్యూర్, ప్యూర్ ,రేర్ లా తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook