)
Zee Awards Ceremony Live Updates: జీ తెలుగు నెట్వర్క్ న్యూస్ ప్రజలకు వినోదంతోపాటు సమాజంపై బాధ్యతతో ప్రజలకు వార్తలు అందిస్తోంది. తెలుగు మీడియాలో సంచలనాలకు కేంద్రంగా నిలుస్తున్న జీ తెలుగు న్యూస్ సమాజంలోని ప్రతిభావంతులను సత్కరించింది. గతంలో వైద్య రంగం.. పోలీస్ శాఖకు అవార్డులు అందించిన జీ తెలుగు న్యూస్.. ఇప్పుడు సమాజంలోని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరించిన వారికి జీ తెలుగు న్యూస్ 'అచీవర్స్' పేరిట పురస్కారాలను ప్రదానం చేసింది. జీ తెలుగు న్యూస్ నెట్వర్క్ జీ అచీవర్స్ అవార్డ్స్ పేరుతో సమాజంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరించిన వారికి హైదరాబాద్లోని జల విహార్లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించింది.
హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ జీ అచీవర్స్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు విశిష్ట అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మెయిల్ గ్రూపు డైరెక్టర్ సుధారెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు హరీశ్ శంకర్, నటులు తనికెళ్ల భరణి హాజరయ్యారు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జీ తెలుగు న్యూస్ చేస్తున్న విశిష్ట సేవలను మాజీ మంత్రి కేటీఆర్, డైరెక్టర్ హరీష్ శంకర్, నటుడు తనికెళ్ల భరణి కొనియాడారు.
కేటీఆర్ ప్రశంసలు..
సమాజంలో విశేషమైన కృషి చేస్తున్న వారికి గుర్తించి.. పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో గొప్పపని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఇలాంటి అవార్డుల ప్రదానోత్సవం చేపట్టిన జీ తెలుగు న్యూస్తో పాటు చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. "జీ తెలుగు మొత్తం బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలామంది వారి వారి రంగాల్లో నిష్ణాతులు పెద్దలు మరియు చాలా పెద్ద ఎత్తున విజయాలు సాధించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వంటి పెద్దలు అట్లాగే మురళి నాయక్ గారి తల్లిదండ్రులని ఇలాంటి ప్రముఖుల్ని సన్మానించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు పూర్తిగా జీతెలుగుకి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న ఒక న్యూస్ మీడియా తెలుగులో చాలా వేగంగా విస్తరిస్తుంది. అప్పడప్పుడు నేనూ కూడా జీ తెలుగు న్యూస్ ఎదుగుదలను గమనిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్ భరత్కు ధన్యవాదాలు." అని కేటీఆర్ వెల్లడించారు.
మీడియా రంగంలో దినాదినా వృద్ధి చెందడమే కాకుండా.. ప్రశ్నించడమే లక్ష్యం.. బాధితులకు అండగా నిలుస్తున్న జీ తెలుగు న్యూస్ మరో అడుగు ముందుకువేసి ప్రతిభావంతులను సత్కరించడం చాలా శుభపరిణామమని ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్, నటులు తనికెళ్ల భరణి అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook