)
Bhagyanagar Ganesh Utsav Committee: వినాయక ఉత్సవాలు అంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్కు పేరు ఉంది. గణేష్ నిమజ్జన శోభయాత్ర హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. ఈనెల 6వ తేదీన జరగనున్న మహా శోభయాత్రకు ఈసారి అదనపు శోభ సంతరించుకుంది. ఈ వేడుకలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు గణేశ్ ఉత్సవ సమితి ప్రకటన చేసింది.
'పాతబస్తీలో కాషాయ జెండా ఎగిరేస్తాం. గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరగాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. భక్తులందరూ తరలిరావాలి' అని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధి రావినూతల శశిధర్ పిలుపునిచ్చారు. 'జీహెచ్ఎంసీలో అధికంగా పన్ను కడుతున్నాం. హిందూ పండుగలకు వాతావరణం సహకరించడం లేదు అంటున్నారు. ఇది బాధాకరం' అని తెలిపారు. 'నగరంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అధికారులు యుద్ధ ప్రతిపాదకన పనులు చేయండి. పాతబస్తీలో ఉదయం నుంచి నిమజ్జనాలు జరగాలి' అని శశిధర్ చెప్పారు.
'కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనతో నిమజ్జనాలు ఆలస్యం కావచ్చు. పోలీసులు కొన్ని చోట్ల హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. గణేశ్ నిమజ్జనాన్ని ఏ శక్తి ఆపదు. హైకోర్ట్ సూచనలు ఉంటే ప్రభుత్వం చూసుకోవాలి' అని గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధి రావినూతన శశిధర్ చెప్పారు. ట్యాంక్బండ్పై నిమజ్జనానికి ఆంక్షలు పెడితే ఊరుకోం. ఎన్ని బారికేడ్లు పెట్టినా తోసేస్తామని హెచ్చరించారు. 'ప్రభుత్వం రేపటివరకు ఏర్పాట్లు చేయకుంటే హిందూ సమాజం అనుకుంటే అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటాం' అని ప్రకటించారు. ఈ సందర్భంగా వినాయక మండప నిర్వాహకులకు కీలక సూచన చేశారు. 'దేశ భక్తి, దైవ భక్తి పాటలు పెట్టుకొని గణేష్ నిమజ్జనాలు చేయాలి' అని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.