)
Khairatabad Ganesh Nimajjanam 2025: అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తైంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. ఖైరతాబాద్ గుండా లక్డీ కపూల్ , టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్ మీదుగా మహా గణపతి ట్యాంక్ బండ్ కు చేరుకునే క్రమంలో మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్సాగర్లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు పూజలు అందుకున్న భారీ విఘ్న నాయకుడు గంగమ్మ ఒడికి చేరుకోవడంతో నిమజ్జన కార్యక్రమంలో మహా క్రతువు ముగిసింది. 69 అడుగుల ఎత్తులో భారీ కాయుడైన, బొజ్జ గణపయ్య సాగర్ గర్భంలో నిమజ్జనమయ్యాడు. ఈ సందర దృశ్యాన్ని కన్నులారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
దీంతో నగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేశ్ మహరాజ్కీ జై అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. దీంతో భక్తులందరూ జై బోలే గణేష్ మహారాజ్ కి జై తో పాటు గణపతి బప్పా మెరియా అగలే బరస్ తూ జల్దీ ఆ అంటే నినాదాలు చేశారు. అంటే వచ్చే యేడాది తొందరగా అంటూ నినాదాలు చేస్తూ గంగమ్మ ఒడిలో ఆయన సేద తీరుతున్న దృష్యాలు చూసి భక్తులు పులకించి పోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.