)
Molested Case filed against praja shanti party chief ka Paul: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ.. కొన్నిసార్లు కాంట్రవర్సీలుగా స్టేట్ మెంట్ లు ఇస్తు తరచుగా వార్తలలో ఉంటారు. కొన్ని సార్లు దేశాల మధ్య యుద్దాల్ని ఆపానని పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఆయన కామెంట్స్ లను చాలా మంది సోషల్ మీడియా వేదికల మీద చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో కేఏ పాల్ ప్రస్తుతం మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దగ్గర పనిచేసే ఒక యువతి.. తనపై కే పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
కే పాల్ దగ్గర ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ లో యువతి అమెరికాన్ కోఆర్డినేటర్ గా గత పదిహేను రోజులుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కేఏ పాల్ ఇటీవల తనను దగ్గరగా అనుకోని మాట్లాడారని, వీపులో చేయిపెట్టి ప్రైవేటు పార్ట్ ను టచ్ చేశాడని యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేసింది.
అంతే కాకుండా వాట్సాప్ లో వల్గర్ గా మెస్సెజ్ చేశారని కూడా యువతి పోలీసులకు తన గొడును చెప్పుకుంది. ఈ క్రమంలో పోలీసులు బాధిత యువతి నుంచిస్టేట్ మెంట్ తీసుకుని కేఏ పాల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసును షీటీమ్స్ కు బదిలీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook