
Fire Accident in RTC Bus: హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన మెహదీపట్నంలో మంగళవారం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బస్సులోకి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్.. ప్రయాణికులను దించేశారు. వారి అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఈ ఘటన కారణంగా ఆ వాహనాల రద్దీ మరింత పెరిగి.. భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఏం జరిగిందంటే?
స్థానికుల కథనం ప్రకారం..మెహిదీపట్నం డిపోకు చెందిన ఓ సిటీ బస్సు ప్రయాణికులతో లింగంపల్లి నుంచి మెహదీపట్నం బయలుదేరింది. ఆ బస్టాండ్ దగ్గరకు రాగానే బస్సులో ఏదో సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. బస్సును తిరిగి స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా లాభం లేదు. ఆ వెంటనే ప్రయాణికులను దించేసిన డ్రైవర్.. ఆ తర్వాత బస్సు ఇంజిన్ దగ్గర బానెట్ పైకి లేపి చెక్ చేయబోయాడు.
ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
హైదరాబాద్ – మెహదీపట్నంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/FpF0TfLZoO
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2025
వెంటనే అందులో నుంచి ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో నుంచి దట్టమైన మంటలు ఎగసిపడగా.. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పొగలతో అలుముకుంది. క్షణాల్లోనే ఆ మంటలు బస్సులో వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ఈ ప్రమాదానికి కారణలేంటనేది ఇంకా తెలియరాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook