)
Woman commits suicide after argument with her husband in Hyderabad: ఇటీవల కాలంలో కొంత మంది భార్యా భర్తలు మరీ టూమచ్ గా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండటం దూరంగా ఉంచి ఏవిధంగా ఒకరిపై మరోకరు శాడిజం చూపించాలో అని ప్లాన్ లు వేసుకుంటున్నారు. మొత్తంగా కొంత మంది భార్యభర్తల చెడు పనుల వల్ల మొత్తంగా వివాహ వ్యవస్థకే ఇటీవల చెడ్డపేరు వచ్చిందని చెప్పుకొవచ్చు.
ఈ క్రమంలో ప్రస్తుతం కొంత కావాలని చేస్తున్నారో లేదా మరీ పెళ్లిళ్లు ఇష్టంలేదని ఇలా ప్రవర్తిస్తున్నారో తెలీదు కానీ మొత్తంగా భార్యభర్తలు ఒకర్ని మరోకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. కొంత మంది ప్రతి చిన్న విషయాల్ని పెద్దది చేసుకుని అయితే చావడం లేదా చంపడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు కాస్త రోడ్డున పడుతున్నాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కిస్మత్ పూర్ ప్రాంతంలో శేఖర్, అరుణ ఇద్దరు దంపతులు ఉంటున్నారు. అయితే.. అరుణకు విపరీతంగా తాగుడు అలవాటు ఉంది. పెళ్లి తర్వాత తెలియడంతో పరువు పోతుందని భర్త భరించుకుంటూ వస్తున్నారు. ఇంతలో భార్య రోజు తన సంపాదంతా తాగుడుకు పెడుతుందని భర్త శేఖర్ ఇంట్లో వాపోయేవాడు.
భార్యకు ఎన్నిసార్లు చెప్పిన ఆమె తన తాగుడు మాత్రం తగ్గించుకోలేదు. ఈక్రమంలో ఇటీవల తాగుడు విషయంలో భార్య అరుణతో, భర్త తీవ్రంగా సీరియస్ అయి భార్యను మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఇంట్లో ఎవరు లేనిది చూసి మద్యంలో ఎలుకల మందు కల్పుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది.
భర్త ఇంటికి వచ్చి చూసేసరికి భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భర్త వెంటన భార్యను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యాడు. ఈక్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని , శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి