)
Begumpet lady pilot molested by senior commercial pilot in Bengaluru: ప్రభుత్వాలు ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చిన ఎన్ని చర్యలు తీసుకున్న కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతి రోజు మహిళకు చెందిన అత్యాచారాలు, వేధింపులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. దీంతో మహిళల భద్రత పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. కామాంధులు గుడి , బడి, ఆఫీస్, పబ్లిక్ ప్రదేశాలు ఎక్కడ కూడా మహిళలు కన్పిస్తే చాలు.. రెచ్చిపోతున్నారు. అత్యాచారాలకు దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన లేడీ పైలట్ బెంగళూరులో ఆమె తోటి కమర్షియల్ పైలర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పైలట్గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిపై, అదే సంస్థలో కమర్షియల్ పైలట్గా ఉన్న 60 ఏళ్ల రోహిత్ శరణ్ అత్యాచారంకు పాల్పడ్డాడు. బస చేసిన రెస్టారెంట్ లో భాగంగా ఆమెతో మాట్లాడేందుకు వచ్చిన పైలట్ అనూహ్యంగా.. ఆమెపై బలత్కారంకు దిగాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది.
తెరుకునే లోపు ఆమెను బలవంతం చేశాడు. అతని పశుబలం ముందు లేడీ పైలర్ విలవిల్లాడిపోయింది. ఆ తర్వాత వదిలించుకుని బైటకు పరుగులు పెట్టింది. యువతి బేగంపేట పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. బాధిత లేడీ పైలట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook