)
Hyderabad Software Engineer one month hospitalized due to pani puri side effects: కొన్నిరోజులుగా భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా దంచి కొడుతున్నాయి.ఈ క్రమంలో చాలా మంది వానలు పడుతున్నాయంటే.. ఏదైన వేడి వేడిగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పానీపూరీలు, మిర్చి బజ్జీల్ని తింటు ఉంటారు. చాలా చోట్ల అసలు ఫుడ్ ను తయారు చేసే క్రమంలో నాణ్యతను అస్సలు పాటించరు. ముఖ్యంగా అపరిశుభ్రంగామైన నీటిని బజ్జీలు, పానీపూరీల తయారీలో ఉపయోగిస్తారు.
ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ పానీపూరీ తిని ఆస్పత్రి పాలయ్యాడు. తొలుత వామిటింగ్ , వీక్ నెస్ లు ఎక్కువగా అయ్యాయి. అతనికి టెస్ట్ లు చేయగా.. తీవ్రమైన హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతను ఆస్పత్రిలో వైద్యం తీసుకొవాల్సి వచ్చింది. దాదాపు నెల రోజుల పాటు అతను ఆస్పత్రిలో ఉండాల్సిన సిట్యూవేషన్ ఏర్పడింది.
ముఖ్యంగా అతని కళ్లు, చర్మం పసుపుపచ్చగా అయిపోవడం (కామెర్లు), కడుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, యూరీన్ పసుపు రంగులోకి మారడం జరిగాయి. దీంతో వైద్యులు నెల రోజుల పాటు వైద్యులు ఎప్పటికప్పుడు మెడిసిన్ ఇచ్చి, మంచి ఫుడ్ ఇచ్చి పూర్తిగా రికవరీ అయ్యేల ా చేశారు .
ఈ క్రమంలో అతను సరైన సమయంలో ఆస్పత్రికి రావడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనతో వైద్యులు.. రోడ్డు పక్కన అమ్మే పానీపూరీ, చట్నీలు, ఫ్రూట్స్ ముక్కలు, మిర్జీబజ్జీలు, సరిగా ఉడకని నూడుల్స్ లాంటివి, ఫాస్ట్ ఫుడ్ ల వాటి వల్ల హెపటైటిస్ ఎ, ఈ లు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.