)
Telangana Crime News: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విదేశీయులు పార్టీ చేసుకున్నారు. జిల్లాలోని మొయినాబాద్ మండలం బాకారంలోని ఓ ఫామ్ హౌస్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో విదేశీయులు అడ్డంగా దొరికిపోయారు. అనుమతిలేని పార్టీలు చేసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఈ ఫామ్ హౌస్లో ఉగాండాతో పాటు కెన్యా దేశాలకు చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ ఫామ్ హౌస్లో అనుమతిలేని పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అధికారులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితులు అనుమానంగా అనిపించి దాడి చేయగా వారిలో చాలా మంది డ్రగ్స్, గంజాయి సేవించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడున్న వారందరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
బాకారంలోని ఓ ఫామ్ హౌస్లో మామస్ అనే ఉగాండాకు చెందిన మహిళ పుట్టినరోజు వేడుకలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇండియాలో ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో 65 బీరు సీసాలు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరితో పాటు మిగిలిన వారి వీసాలను చెక్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీని కోసం ఇమిగ్రేషన్ అధికారులను ప్రత్యేకంగా పిలిపించినట్లు చెప్పుకొచ్చారు. పట్టుబడిన 51 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలేనని సమాచారం. ఇమిగ్రేషన్ చెకింగ్ పూర్తయిన వెంటనే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook