)
Telangana OBC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలలో, విద్యా రంగంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆలస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోరుతూ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రసంగించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్లకు ఈ బిల్లు గుదిబండలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా ఆ చట్టం అడ్డుగా ఉందని దాన్ని తొలగించడానికి తాము ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపామని అది ఆమోదం పొందలేదని సీఎం రేవంత్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు దిశగా వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ధర్నా చేయొచ్చు..కానీ, అక్కడ ధర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని, అందుకే దేశం నడిబొడ్డున ఢిల్లీలో ధర్నా చేస్తే పలువురు ఎంపీలతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్వాది పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలు చెందిన 100 మంది ఎంపీలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేస్తారని సీఎం రేవంత్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తాము అండగా ఉంటామని బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల ఎంపీలు మద్దతుగా నిలిచారని అన్నారు. మనదేశంలో గత వందేళ్ళ కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన కులగణన చేయలేదని.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 300 మంది ముఖ్యమంత్రులు దేశంలోని వివిధ రాష్ట్రాలను పరిపాలించిన కులగణన చేసిన ఘనత తనకే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు.
ఈ బీసీ రిజర్వేషన్ అమలు కోసం తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్ర రావు వంటి నాయకులు అడ్డుగా ఉన్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి సంఘీభావంగా ఈ ధర్నాలో టిఆర్ఎస్ నాయకులు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అంతా గ్రామాలతో బతుకుతుందని విమర్శించారు. పదవులు అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆపేస్తే తమ తడాఖా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఇకపై ఎప్పుడు ఢిల్లీ వచ్చేది లేదని.. తెలంగాణ గల్లీల బీజేపీ నా చేతులతో కొట్లాడుతామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును తక్షణమే ఆమోదం చేసి తెలంగాణ ప్రజలకు తన మద్దతు తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేయని పక్షంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ప్రధాని మోదీకి గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణకుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అట్లూరి లక్ష్మణరావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి సహ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook