)
Woman Killed In Kavadiguda: సికింద్రాబాద్లో జరిగిన ఈ దారుణ హత్యతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రద్దీగా ఉండే నగరంలో ఇలాంటి సంఘటన జరగడం కలవరానికి గురిచేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం కవాడిగూడలోని రత్నదీప్ అపార్ట్మెంట్లో నాల్గవ అంతస్తులో నివసిస్తున్న మహిళపై ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. నిందితుడు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయి. హత్య జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు, రక్తపు మరకలు వంటి ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. నిందితుడిని త్వరలోనే పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్య పాత కక్షల వల్ల జరిగిందా?, దోపిడీ కోసమా లేక అక్రమ సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి మరీ చంపడానికి ఉన్న కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అయితే, రత్నదీప్ సూపర్ మార్కెట్లోని నాలుగవ అంతస్తులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ భవనంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల దృశ్యాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. వాటి ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగరంలో ఒక ఒంటరి మహిళ దారుణంగా హత్యకు గురికావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి