
Girl Gang-Raped: మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా..మరెన్నో కఠిన చట్టాలను అమలు చేసినా..కామాంధుల ఆక్రుత్యాలకు మాత్రం అడ్డూఅదుపులేకుండా పోతుంది. తాజాగా 15ఏళ్ల బాలికపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై వీడియో రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. మరోసారి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్లీ బెదిరించడంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్నాటకలోని బెలగావిలో జరిగింది. 15ఏళ్ల బాలికను ఆమె స్నేహితుడు 6 నెలల క్రితం బెలగావి శివారులోని కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యాచారాన్ని మొబైల్లో రికార్డు చేశారు.
ఈ వీడియోతో ఆ బాలికను ఆ వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేశారు. అక్కడకు రాకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. మళ్లీ ఆ ప్రాంతానికి ఆ బాలికను రప్పించారు. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మరోసారి దీన్ని రికార్డ్ చేశారు. ఇలా పదే పదే ఆమెను బెదిరించారు. విసిగిపోయిన ఆ బాలిక మే 31వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వెంటనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మిగతా నలుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಗೆ ಅಧಿಕಾರ - ಕರ್ನಾಟಕದ ಮಹಿಳೆಯರ ರಕ್ಷಣೆಗೆ ಸಂಚಕಾರ!
ಬೆಳಗಾವಿಯಲ್ಲಿ ಅಪ್ರಾಪ್ತ ಯುವತಿಯ ಮೇಲೆ 6 ಜನ ಸಾಮೂಹಿಕ ಅತ್ಯಾಚಾರ ನಡೆಸಿ, ಆ ಘಟನೆಯನ್ನು ವಿಡಿಯೋ ಮಾಡಿಕೊಂಡು ಬ್ಲಾಕ್ಮೇಲ್ ಮಾಡುತ್ತಿದ್ದ ಪ್ರಕರಣ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ.
ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಸಚಿವರಾದ @laxmi_hebbalkar ಅವರೆ, ನೀವು ಸಚಿವರಾದ ಬಳಿಕ ನಿಮ್ಮ… pic.twitter.com/76SJV4xhOf
— BJP Karnataka (@BJP4Karnataka) June 1, 2025
కాగా ఈ ఘటనపై కర్నాటకలో రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది బీజేపీ. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ అధికార కాంగ్రెస్ ను విమర్శించింది. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో మహిళల రక్షణకు ముప్పు వాటిల్లింది. బెల్గాంలో ఆరుగురు వ్యక్తులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆ సంఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన కేసు వెలుగులోకి వచ్చింది" అని కర్ణాటక బిజెపి ఒక ఎక్స్ పోస్ట్లో రాసింది.
కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తన సొంత జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ బిజెపి ఆమెను లక్ష్యంగా చేసుకుంది."ప్రియమైన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి @laxmi_hebbalkar, మీరు మంత్రి అయినప్పటి నుండి, మీ స్వస్థలమైన జిల్లాలో మహిళలు పూర్తిగా రక్షణ లేకుండా పోయారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, బాధిత యువతికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు కర్ణాటక పోలీసులు ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook